సంతోషంలో చిలసౌ చిత్ర బృందం!

  • August 4, 2018 / 08:49 PM IST

“నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి చేసిన తొలి చిత్రం “చిలసౌ”. అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్, రుహాని శర్మ జంటగా నటించిన ఈ మూవీ నిన్న రిలీజ్ అయి మంచి స్పందన అందుకుంది. అన్నపూర్ణ స్టూడియోస్‌, సిరునీ సినీ క్రియేషన్స్‌ బ్యానర్స్‌పై అక్కినేని నాగార్జున, భరత్‌ కుమార్‌, జస్వంత్‌ నడిపల్లి సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీపై సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు ప్రసంశలు గుప్పిస్తున్నారు. ఫ్రెష్ కథ, కథనం, మంచి ఫీల్ కలిగిన సంగీతం, హీరో, హీరోయిన్ పాత్రలను ఎంతో సహజంగా మలిచిన డైరక్టర్ ని అభినందిస్తున్నారు. ఈ మూవీ ద్వారా సుశాంత్ సూపర్ హిట్ అందుకున్నారు.

“కలక్షన్ల పరంగా దూసుకెళ్తున్న ఈ మూవీకి ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రఖ్యాతగాంచిన డేటా బేస్(ఐడీఎంబీ) సంస్థ “చిలసౌ”కి మంచి రేటింగ్ ఇచ్చింది. ఏకంగా 9 రేటింగ్ ఇచ్చేసింది. చాలా తక్కువ సినిమాలు మాత్రమే ఈ రేటింగ్‌ను దక్కించుకున్నాయి. దీంతో చిత్రబృందం ఆనందపడుతోంది. అక్కినేని నాగార్జున అయితే అన్నపూర్ణ స్టూడియోస్‌ లో రాహుల్ రవీంద్రన్ కి మరో అవకాశం ఇచ్చారు. సొంత బ్యానర్లో మరో అక్కినేని హీరోని డైరక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. కథ, అందుకు సూటయ్యే హీరో ఓకే అయిన తర్వాత అధికారికంగా ప్రకటించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus