రష్మీ కి కోపమొచ్చింది!

  • July 11, 2016 / 02:20 PM IST

రష్మీ తాజా చిత్రం “అంతం” విడుదలైన రెండు రోజుల్లోనే రెండు కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకొని విమర్శకులకు షాక్ ఇచ్చింది. సినిమా అస్సలు బాలేదు అని చూసినవాళ్ళందరూ నేత్తీనోరు కొట్టుకొని మరీ చెప్పినా.. రష్మీ అందాల ఆరబోతను చూసేందుకు జనాలు క్యూ కట్టారు.

కలెక్షన్స్ కారణంగా దర్శకనిర్మాత ఖుషీగా ఉన్నా.. హీరోయిన్ గా నటించిన రష్మీ మాత్రం కోపంతో రగిలిపోతోందట. సినిమా సక్సెస్ అయితే సంతోషపడడం మానేసి ఇలా సీరియస్ అవ్వడమేంటి అనుకొంటున్నారా?. అసలు మేటర్ ఏంటంటే.. సినిమాలో రష్మీ అందల ఆరబోత ఉండేది కేవలం 5 నిమిషాల పాటలో మాత్రమే. ఆ తర్వాత సినిమా మొత్తం సీరియస్ గా సాగుతుంటుంది.

ఆ మాత్రం దానికి సినిమా మొత్తం రష్మీ అందాలతో నింపేసినట్లు కావరింగ్ ఇచ్చాడు దర్శకుడు. దాంతో “అసలు సినిమా కాన్సెప్ట్ ఏమిటన్నది చూపించకుండా, కేవలం నా అందాల ప్రదర్శనను మాత్రమే చూపిస్తూ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయడం సరికాదు” తెగ సీరియస్ అయిపోయింది రష్మీ, దర్శకనిర్మాత మాత్రం ఇదేమీ పట్టించుకోకుండా హ్యాపీగా కలెక్షన్లు చూసి మురిసిపోతున్నాడు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus