తమిళ స్టార్ హీరో సరసన రష్మిక మందన..!

  • February 23, 2019 / 05:01 PM IST

‘ఛలో’ ‘గీత గోవిందం’ ‘దేవదాస్’ వంటి చిత్రాలతో టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక మందన. ప్రస్తుతం మరోసారి విజయ్ దేవరకొండ సరసన ‘డియర్ కామ్రేడ్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు చేతిలో మంచి ఆఫర్లు ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ – అల్లు అర్జున్ కాంబినేషన్లో తెరకెక్కబోయే చిత్రంలో కూడా రష్మిక పేరు పరిశీలనలో ఉందని టాక్ నడుస్తుంది. ఇక కన్నడంలో కూడా హీరోయిన్ గా రాణిస్తున్న రష్మిక త్వరలో కోలీవుడ్ ఇండస్ట్రీకి కూడా అడుగు పెట్టబోతుందని సమాచారం.

అందుతున్న సమాచారం ప్రకారం తమిళంలో కార్తి సరసన ఓ చిత్రంలో రష్మిక హీరోయిన్ గా నటించబోతుందట. ‘రెమో’ చిత్ర దర్శకుడు బకీయ రాజ్ కందన్… హీరో కార్తి తో ఓ చిత్రాన్ని తీయబోతున్నాడట. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ చిత్రంలో హీరోయిన్ గా రష్మికను ఎంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ఆమెను సంప్రదించారట. దీనికి రష్మిక కూడా అంగీకరించిందని… కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం. మరి ఈ చిత్రంతో రష్మిక కోలీవుడ్ లో కూడా బిజీగా మారిపోవడం ఖాయం అంటున్నారు ఆమె అభిమానులు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus