అల్లు అర్జున్, రవితేజ చేయననడంతో నిఖిల్ వద్దకు వెళ్లిన కథ!

  • December 9, 2017 / 07:19 AM IST

స్వామిరారా, కార్తికేయ, కేశవ, ఎక్కడికి పోతావు చిన్నవాడా.. వంటి థ్రిల్లర్స్ తర్వాత నిఖిల్ మాస్ సినిమా చేస్తున్నారు. కన్నడలో విజయవంతమైన “కిర్రాక్ పార్టీ” సినిమా రీమేక్‌ లో నటిస్తున్నారు. అదే పేరుతో వస్తున్న ఇందులో నిఖిల్.. కృష్ణ అనే కాలేజ్ యూనియన్ లీడర్‌గా సందడి చేయనున్నాడు. రీసెంట్ గా వచ్చిన ‘కిర్రాక్ పార్టీ’ మూవీ ఫస్ట్‌లుక్‌ అదరగొట్టింది. శరన్ కొప్పిశెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో కన్నడ భామ సంయుక్త హెగ్డే, బాలీవుడ్ బ్యూటీ సిమ్రాన్ పరీనాలు నిఖిల్‌తో జోడీ కడుతున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. ఇక ఈ మూవీ ‘స్వామిరారా’ దర్శకుడు సుధీర్ వర్మ స్క్రీన్ ప్లే అందిస్తుండగా.. ‘కార్తికేయ’ దర్శకుడు చందూ మొండేటి మాటలను అందిస్తుండటం మరో విశేషం.

ప్రస్తుతం 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘కిర్రాక్ పార్టీ’ చిత్రాన్ని వేసవిలో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. దీని తర్వాత కూడా నిఖిల్ రీమేక్ బాటలో నడవనున్నట్లు తెలిసింది. తమిళంలో హిట్ సాధించిన కానితన్ సినిమాని తెలుగులో చేయడాకిని ఓకే చెప్పినట్లు సమాచారం. ఈ కథను చేయమని మొదట డైరక్టర్ సంతోష్ బన్నీని కోరారంట. అతని చేయడానికి ఆసక్తి చూపలేదని టాక్. అలాగే అల్లు అర్జున్ తర్వాత రవితేజ వద్దకు వెళ్ళింది. అతనికి ఇష్టమైనప్పటికీ స్క్రిప్ట్ రెడీ చేయడానికి సమయం పట్టడంతో వద్దన్నారు. ఆ కథ చివరికి నిఖిల్ వద్దకు చేరింది. నిఖిల్ సంతోషంగా ఒకే చెప్పారు. వచ్చే ఏడాది ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus