డ్రగ్స్ కేసు విచారణకు హాజరైన రవితేజ!

  • July 28, 2017 / 06:08 AM IST

డ్రగ్స్ కేసులో నోటీసులు అందుకున్న నటీనటుల్లో రవి తేజ ఒకరు. ప్రస్తుతం అతను రాజాది గ్రేట్, టచ్ చేసి చూడు  సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ సిట్ ముందుకు హాజరవ్వక తప్పలేదు. నిన్ననే విదేశాల నుంచి హైదరాబాద్ కి చేరుకున్న రవితేజ, ఈరోజు ఉదయం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి నాంపల్లిలోని ఎక్సయిజ్ కార్యాలయానికి చేరుకున్నారు. తన తరఫు న్యాయవాదుల సలహాలు తీసుకుని రవితేజ సిట్ విచారణకు వచ్చారు.

రవితేజకు తానే స్వయంగా డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు డ్రగ్స్‌ మాఫియా కేసులో నిందితుడు జీశాన్‌ వెల్లడించడంతో ఆ కోణంలో అధికారులు ప్రశ్నలు గుప్పించనున్నారు. అలాగే కెల్విన్‌, జీశాన్‌తో గల సంబంధాలపై  అడగనున్నట్లు సమాచారం. హీరో రవితేజను చూసేందుకు సిట్‌ కార్యాలయం వద్దకు భారీగా జనాలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో సిట్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus