తమ్ముడు మరణం తర్వాత వచ్చిన విమర్శలపై ఘాటుగా స్పందించిన రవితేజ

  • July 5, 2017 / 10:05 AM IST

షూటింగ్ లోను, బయట ఎప్పుడూ సరదాగా ఉండే రవితేజ ఆవేశపడ్డారు. తన తమ్ముడు భరత్ మరణం తర్వాత వచ్చిన వార్తలపై మండి పడ్డారు. తమ్ముడు భరత్‌ మరణం తర్వాత తొలిసారి ఆయన బుధవారం మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ” రోడ్డు ప్రమాదంలో భరత్‌ మరణించాడని తెలిసిన వెంటనే నేను, మా కుటుంబసభ్యులు తీవ్రంగా ఆవేదన చెంది కుప్పకూలము. తమ్ముడిని అలా చూసి భరించలేకనే అంత్యక్రియలకు  వెళ్ళలేదు” అని రవితేజ స్పష్టం చేశారు. భరత్‌ అంత్యక్రియలకు తాము హాజరుకాని విషయంలో సోషల్‌ మీడియాలో, కొన్ని చానెళ్లలో వచ్చిన కథనాలు సరికావన్నారు.

భరత్‌ అంత్యక్రియలను జూనియర్‌ అర్టిస్టుతో జరిపించారన్న కథనాలు అసత్యమని, తన చిన్నాన్న, సోదరుడు భరత్‌ అంత్యక్రియలు నిర్వహించారని తెలిపారు. భరత్‌ మృతి చెందిన తెల్లారే తాను షూటింగ్‌కు వెళ్లానంటూ వచ్చిన కథనాలను ఖండించారు. తెల్లారే షూటింగ్‌కు వెళ్లలేదు.., నెక్ట్స్‌ డే వెళ్లానని చెప్పారు. అప్పుడు కూడా మనసుసహకరించలేదని అయితే పాతికమంది ఆర్టిస్టుల కాంబినేషన్‌ కావడంతో తాను షూటింగ్‌కు వెళ్లాల్సి వచ్చిందని వెల్లడించారు. వాస్తవాలు తెలుకొని వార్తలు రాయమని సోషల్ మీడియాలో గాసిప్స్ రాసేవారికి గట్టిగా చెప్పారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus