అందులో మత్తు ఉంది : రాశీ ఖన్నా

  • August 9, 2016 / 02:01 PM IST

టాలీవుడ్ లో జోరు మీదున్న భామ రాశీ ఖన్నా. ఊహలు గుసగుసలాడే చిత్రంతో లవ్లీ హిట్ అందుకుంది.  తాజాగా సుప్రీమ్ తో మరో హిట్ ని తన జాబితాలో వేసుకుంది. ప్రస్తుతం ఎనర్జిటిక్ హీరో రామ్ “హైపర్” మూవీలో నటిస్తోంది. గోపీచంద్ తో జిల్ తర్వాత  “ఆక్సిజన్” తో రావడానికి సిద్ధంగా ఉంది. చేతినిండా అవకాశాలతో బిజీగా ఉన్న ఢిల్లీ సుందరి కాస్త ఖాళీ దొరికితే పెన్ను, పేపర్ తీసుకుని కవిత్వాలు రాయడంలో మునిగి పోతుందంట.

“నేను ఢిల్లీ లో లేడీ శ్రీ రామ్ కాలేజీలో డిగ్రీ (ఇంగ్లిష్ హానర్స్) చదివే సమయంలో కాలేజీ “జామ్” మ్యాగజైన్ కు ఎడిటర్ గా పని చేసా. అప్పుడే నేను రాయడంలోని మజాను ఆనందించడం మొదలు పెట్టా. అక్షరాల్లో ఏదో తెలియని మత్తు ఉంటుంది. పుస్తకం చేత పట్టుకుని చదువుతుంటే టైమే తెలియదు. అలాగే పెన్ను, పేపర్ ఉంటే లోకంతో సంబంధమే ఉండదు. కవిత్వం రాసుకుంటూ కూర్చుంటాను” అని రాశీ ఖన్నా చెప్పింది. ఎప్పటికైనా ఆమె రాసిన కవితలన్నింటిని పుస్తకంగా ప్రచురిస్తానంటోంది ఈ ముద్దుగుమ్మ. కాపీ రైటర్ గా అవుదామని భావించిన రాశీ అనుకోకుండా చిత్ర సీమలోకి అడుగు పెట్టి టాప్ హీరోయిన్ గా ఎదుగుతోంది. టాలీవుడ్ లో తనకి ఆదరణ బాగా ఉండడంతో బాలీవుడ్ కి వెళ్లే ఆలోచనలేదని ఆమె స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus