చెర్రీ కి సురేందర్ రెడ్డి పై అంత నమ్మకం ఏమిటి ?

  • February 2, 2017 / 10:51 AM IST

కిక్, రేసుగుర్రం, ధృవ.. ఈ మూడు సినిమాలు డైరక్టర్ సురేందర్ రెడ్డికి మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ని డైరక్ట్ చేసే అవకాశాన్ని అందించాయి. చిరు  హీరోగా నటించిన 150వ చిత్రం ‘ఖైదీ నంబర్ 150’ బాక్స్ ఆఫీస్ రికార్డులన్నింటిని బద్దలు కొట్టింది. దీంతో మెగాస్టార్ ఉత్సాహంతో నెక్స్ట్ సినిమాపై దృష్టి పెట్టారు. ఆ మూవీని కూడా కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లోనే నిర్మిస్తానని రామ్ చరణ్ తేజ్ చెప్పడమే కాకుండా.. డైరక్టర్ గా సురేందర్ రెడ్డి ని తీసుకున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. పెద్ద హీరోలతో సినిమాలు చేయని ఈ డైరక్టర్ కి ఈ ఛాన్స్ ఇవ్వడం మంచిదేనా ? అనే విమర్శ టాలీవుడ్ లో షికారు చేస్తోంది.

ఈ మాట చెర్రీ చెవిన పడేసరికి ఆయన స్పందించారు. తాజాగా చరణ్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ” సురేందర్ రెడ్డి మేకింగ్ ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. ఆ ప్రతిభను ధృవ సినిమాతో మరోసారి నిరూపించుకున్నారు. నాన్నగారిని కూడా స్టైలిష్ గా చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. అందుకే 151 సినిమాకు డైరక్టర్ గా అతన్ని తీసుకున్నాను. నాన్నగారికి సురేందర్ రెడ్డి పై మంచి అభిప్రాయం ఉండడంతో ఆయన ఒకే అన్నారు” అని చెప్పారు. సురేందర్ రెడ్డి ప్రస్తుతం పరుచూరి బ్రదర్స్ తో కలిసి మెగాస్టార్ కోసం  ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కథను తెరపైన ఏ విధంగా చూపించాలో చర్చిస్తున్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus