ఫ్లాప్ అని తెలిసినా ఇచ్చిన మాట కోసం చేశాడట

  • July 4, 2018 / 01:20 PM IST

‘తిక్క’ మొదలుకొని ‘ఇంటిలిజెంట్’ వరకూ వరుసగా ఐదు ప్లాప్ సినిమాల్లో నటించాడు సాయిధరమ్ తేజ్. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో నటించిన “నక్షత్రం”, వి.వి.వినాయక్ తెరకెక్కించిన “ఇంటిలిజెంట్, గోపీచంద్ మలినేని రూపొందించిన “విన్నర్”, సునీల్ రెడ్డి “తిక్క”, బీవీఎస్ రవి “జవాన్”.. ఇలా ఈ దర్శకులందరూ తేజ్ కి ఒకర్నిమించి మరొకరు బడా ఫ్లాప్ ని ఇచ్చినవారే. ఈ విధంగా వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ఏ హీరో అయినా తదుపరి సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు కానీ.. తేజ్ మాత్రం కెరీర్ ను ఏమాత్రం లెక్క చేయకుండా కేవలం దర్శకులకు ఇచ్చిన మాట కోసం ఆ సినిమాలు చేశాడట.

కొన్ని సినిమాల రిజల్ట్స్ అయితే ముందే తెలిసినా కూడా కేవలం డైరెక్టర్ కి ఇచ్చిన మాట కోసం షూటింగ్ లో పాల్గొనేవాడట. నిన్న జరిగిన ‘తేజ్ ఐ లవ్ యూ” ప్రీరిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్ ఈ విషయాన్ని ప్రస్తావించి.. “ఆ సినిమా పోతుందని తనకు ముందే తెలుసున‌ని, మాటిచ్చాను కాబట్టి చేశానని సాయిధరమ్ తేజ్ చెప్పారని” అల్లు అరవింద్ చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. మరి “తేజ్ ఐ లవ్ యూ” పరిస్థితి ఏమిటో ఇంకొక్క రోజు ఆగితే తెలిసిపోతుంది. ఈ సినిమా మీద సాయిధరమ్ తేజ్ తోపాటు హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ & డైరెక్టర్ కరుణాకరణ్ కూడా భారీ ఆశలు పెట్టుకొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus