“ప్రభాస్”వల్ల సర్వం కోల్పోయారా??

  • July 11, 2016 / 12:11 PM IST

టాలీవుడ్ టాప్ హీరో, మన బాహుబలి ప్రభాస్ తో సినిమా అంటేనే నిర్మాతకు కాసుల వర్షం కురిసినట్లే. టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరుగా ప్రభాస్ ఉన్నప్పటికీ ఇప్పటికీ ప్రభాస్ సినిమా విడుదల అవుతుంది అంటే పెద్ద పోటీగా భావించే అవకాశం లేదు అనే చెప్పాలి. ఎందుకంటే ప్రభాస్ మ్యానరిజం అంటే డిఫరెంట్, పోటీలు పడటం, ఫ్యాన్స్ ను రెచ్చగొట్టడం ప్రభాస్ కు తెలియని విషయం. ఇదిలా ఉంటే ఇప్పుడంటే వరుస హిట్స్ తో బాహుబాలి లాంటి ప్రపంచ ఖ్యాతి గాంచిన సినిమాలో నటించడం వల్ల ప్రభాస్ తో సినిమా తీస్తే నిర్మాతలు సేఫ్ జోన్ లో ఉంటారు అని చెప్పగలుగుతున్నాం..కానీ ప్రభాస్ తో ఒకప్పుడు సినిమా తీసి దాదాపుగా రోడ్డుపాలైన ఇద్దరు నిర్మాతలు ఇప్పుడిప్పుడే కోల్కుంటున్నారు అని తెలుస్తుంది.

విషయం లోకి వెలితే…బాలాజి ఆర్ట్స్ పతాకంలో భగవాన్, పుల్లారావు నిర్మాతలుగా, ప్రముఖ దర్శకుడు లారెన్స్ దర్శకత్వంలో రెబెల్ అనే సినిమా తెరకెక్కింది. అయితే ఆ సినిమా దర్శకుడు లారెన్స్ తమకు చెప్పిన బడ్జెట్ కన్నా రెండింతలు ఖర్చు పెట్టి సినిమా తీయించాడు. తీరా సినిమా చూస్తే ఫ్లాప్.. ఇక నిర్మాతల కష్టాలు అందరికి తెలిసిందే.

అయితే ఈ విషయంపై నిర్మాతలు లారెన్స్ మీద కేసు కూడా వేసినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఆ లాస్ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుని మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు ఈ ఇద్దరు నిర్మాతలు. గోపిచంద్ హీరోగా సంపత్ నంది డైరక్షన్లో ఒక సినిమా చెయ్యబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా కేథరిన్ త్రెసాను సెలెక్ట్ చేస్తున్నారట. సో బాలాజి ఆర్ట్స్ కు ఈ సినిమా పెద్ద హిట్టై మంచి లాభాలు తెచ్చిపెట్టాలి అని ఆశిద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus