కొన్నిసార్లు కొన్నిటికి స్పందించకపోవడమే మంచిది : రెజీనా

  • July 9, 2018 / 09:39 AM IST

చికాగో  సెక్స్‌రాకెట్‌ లో టాలీవుడ్ హీరోయిన్స్  ఉన్నారనే  సంఘటన తెలుగు సినీ ప్రముఖులను ఉలిక్కిపడేలా చేసింది. ఆ విషయంపై అనసూయ, శ్రీ రెడ్డి లాంటి వాళ్ళు మొదట్లోనే స్పందించారు. హీరోయిన్ మెహ్రీన్ కూడా ఈ రాకెట్ తో ప్రమేయం లేకపోయినా పోలీసుల నుంచి విచారణ ఎదుర్కొన్నారు. ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు. వ్యభిచారం చేసిన హీరోయిన్స్ జాబితాలో వీరి పేర్లు ఉన్నాయని గత కొంతకాలంగా కొన్ని మీడియా సంస్థలు కొంతమంది పేర్లను ప్రచారం చేశాయి. అందులో రెజీనా పేరు కూడా ఉంది. అయితే ఆ వార్తలపై అప్పుడు ఆమె అసలు స్పందించలేదు. ఎందుకు స్పందించలేదో ఇప్పుడు వివరణ ఇచ్చింది.

‘‘కొన్నిసార్లు కొన్నిటికి స్పందించకపోవడమే గొప్ప స్పందన అని నా అభిప్రాయం. నా మీద ఉన్న ఆరోపణల్లో నిజంగా నిజం ఉంటే తప్పకుండా ఏదో ఒక పరిష్కారం కనిపించి ఉండేది. అందులో ఏమీ లేదు. అలాంటప్పుడు పబ్లిసిటీ కోసం ఎందుకు నేను రియాక్ట్‌ కావాలి? ఒకవేళ నేను రియాక్ట్‌ అయినా, దాని మీద మళ్లీ ఇంకెవరో రియాక్ట్‌ అవుతారు. వీటన్నిటి వల్ల పరిష్కారాలు ఉండవు కదా. అలాంటప్పుడు నేనెందుకు మాట్లాడాలి? ప్రజలు ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు. ఒక జర్నలిస్ట్‌ ఏదైనా చెప్తే, కొందరు నమ్ముతారు. అలాంటప్పుడు జర్నలిస్ట్‌లు మాట్లాడటానికి ముందు నిజం తెలుసుకుని, బాధ్యతగా భావించి మాట్లాడాలి’’ అని రెజీనా చెప్పారు. ప్రస్తుతం మూడు తమిళ సినిమాలతో బిజీగా ఉన్న రెజీనా తెలుగులో మూవీ చేయడానికి పలు కథలని వింటున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus