Raja Sen: ప్రముఖ దర్శకుడు కన్నుమూత..

బెంగాలీ సినీ పరిశ్రమలో ఒక విశిష్టమైన అధ్యాయం ముగిసింది. ప్రముఖ బెంగాలీ దర్శకుడు రాజా సేన్ (71) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కోల్‌కతాలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు, రాజా సేన్‌ కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు. 1996లో వచ్చిన ‘దాము’ సినిమాతో రాజా సేన్ దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించారు. కెరీర్‌లో అవార్డులు, రివార్డులు అందుకున్నారు.

Raja Sen

ఒక బాలుడు, ఏనుగు మధ్య ఉండే అనుబంధం, స్నేహం నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను గెలుచుకోవడమే కాకుండా, ఉత్తమ బాలల చిత్రంగా జాతీయ చలన చిత్ర పురస్కారాన్ని కూడా అందుకుంది. అలా తొలి సినిమాతోనే జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. సామాజిక స్పృహ, మానవ సంబంధాలు, సాంస్కృతిక మూలాలను ఆవిష్కరించే దర్శకుడిగా రాజా సేన్ పేరు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో దేశ్’, ‘మాయామృదంగ’, ‘దేబిపక్ష’, ‘కల్ పురుష్’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. అవన్నీ బెంగాళీ సినిమాలో చిత్రరాజాలుగా నిలిచాయి.

వెండితెరకే కాకుండా బుల్లితెరపై కూడా రాజా సేన్‌ తనెంత గొప్ప దర్శకుడు అనేది చూపించారు. టీవీ సీరియళ్లు, ప్రముఖుల జీవిత చరిత్రల డాక్యుమెటరీలు రూపొందించారు. బెంగాలీ సాహిత్యం, సంస్కృతులపై సేన్‌ అభిరుచి ఆ డాక్యుమెంటరీల్లో స్పష్టంగా కనిపిస్తుంది. రాజా సేన్ మృతి పట్ల పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు, నటీనటులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

సూర్యతో సినిమా… ఒకసారి మిస్‌ అయ్యా.. త్రివిక్రమ్‌ కామెంట్స్‌ వైరల్‌

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus