ఎందుకు ఇలా చేస్తున్నారంటూ ఫ్యాన్స్ పై అసంతృప్తి వ్యక్తం చేసిన రేణుదేశాయ్

  • November 21, 2018 / 11:19 AM IST

రేణుదేశాయ్ ఇదివరకు కూడా ఫ్యాన్స్ విషయంలో అసహనానికి గురైంది. అయితే ఎందుకు ఎప్పుడు అడిగినవే అడిగి ఇలా చేస్తారంటూ ఆమె ఇటీవలే అసంతృప్తికి లోనైంది. రేణుదేశాయ్ కవితలు రాస్తూ ఉంటుంది, ఈ కవితలని తెలుగులో అనంత్ శ్రీరామ్ తో తర్జమా చేయించి ఒక బుక్ రూపంలోకి తీసుకువరాలని ఆమె భావించింది. ఇలా బుక్ రాబోతుందనే విషయం అందరికి చెప్పడానికి ఆమె సోషల్ మీడియా లో లైవ్ కి వచ్చింది. ఇక ఈ లైవ్ లో ఆమె ఫ్యాన్స్ స్పదించిన తీరుపై అసహనానికి గురైంది.

ఇలా లైవ్ కి వచ్చిన రేణుదేశాయ్ కి కొందరు అభిమానులు అఖీరా ఎలా ఉన్నాడు, పెళ్లి చేసుకున్నారా, పెళ్ళికొడుకు ఎలా ఉంటాడు, పవన్ కళ్యాణ్ గురించి చెప్పండి, అఖీరా సినిమాల్లోకి ఎప్పుడు వస్తాడు అంటూ ఇలాంటి ప్రశ్నలే ఆమెకి ఎక్కువగా రావడంతో చాలా అసంతృప్తికి లోనైనని చెబుతుంది. నేను ఏదో ఒకటి చెబుదాం అని వచ్చాను అది వినకుండా ఈ సందర్భంలో వాటి గురించి ఎం అడగకుండా చెప్పేది చెప్పనివ్వకుండా ఇలా విసిగించే ప్రశ్నలు ఎలా అడుగుతారంటూ, వ్యక్తిగత విషయాలు ఇప్పుడు అవసరమా అంటూ ఫ్యాన్స్ పైన అసంతృప్తిగా ఉందంటా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus