మంచు లక్ష్మి చేస్తున్న పనిని అభినందించిన రేణు దేశాయ్.!

  • April 19, 2018 / 10:44 AM IST

డైలాగ్ కింగ్ మోహన్ బాబు కూతురైన మంచు లక్ష్మి తనకంటూ సొంత గుర్తింపు తెచ్చుకుంది. వ్యాఖ్యాతగా, నటిగా, నిర్మాతగా.. అటు బుల్లి తెరలోను, ఇటు వెండితెరపైనా దూసుకుపోతోంది. అంతేకాదు మేము సైతం అనే కార్యక్రమం ద్వారా అనేకమంది పేదల జీవితాల్లో వెలుగునింపుతోంది. ప్రముఖ నటీనటులను ఈ కార్యక్రమానికి తీసుకొచ్చి.. వారికి సాయం చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. తాజాగా ఈ షోలో నటి, దర్శకురాలు రేణూ దేశాయ్ పాల్గొన్నారు. మంచులక్ష్మితో కలిసి ఓ మంచి పనిలో భాగస్వామిని అయినందుకు ఎంతో సంతోషంగా ఉందంటూ రేణు వెల్లడించారు. ప్రస్తుతం ఆమె చేసిన పోస్ట్ ఎంతోమందిని ఆకర్షించింది. ఆ పోస్ట్ లో పూర్తిగా ఏముందంటే.. “నేను బొమ్మలు అమ్మి 30 వేలు సంపాదించా.

వాటికి మరో 20 వేలు కలిపి ఇచ్చాను. ఆ మొత్తానికి మంచు లక్ష్మి మరో లక్ష  జత చేశారు. 35 మంది విద్యార్థుల చదువు కోసం 1.5 లక్షలు లక్ష్మి విరాళంగా ఇచ్చారు.” అని సోషల్ మీడియా వేదికపై తన ఫీలింగ్స్ ని షేర్ చేసుకున్నారు. అంతేకాదు “అవసరాల్లో ఉన్న వారికి మీకు తోచినంతలో సాయం చేయండి. మహిళల చదువు, ఆహారం, వైద్య సదుపాయాల కోసం సాయం అందించాలి. మీరు ఇచ్చే చిన్నమొత్తం అయినా వేరొకరి జీవితాల్లో అది ఎంతో పెద్ద విషయం” అని రేణూ అభిమానులను కోరారు. మంచు లక్ష్మితో తాను కలిసి ఉన్న ఫోటోని షేర్ చేశారు. ట్వీట్ తో పాటు ఫోటో కూడా లైక్లు అందుకుంటోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus