రాజమౌళి ప్రొఫైల్ పిక్ ఏమి చెబుతోంది ?

  • June 20, 2016 / 11:19 AM IST

బాహుబలి చిత్రం ద్వారా తెలుగు సినిమాలకు అంతర్జాతీయ కీర్తి తెచ్చిపెట్టిన ఘనుడు ఎస్.ఎస్.రాజమౌళి.  ఇప్పుడు బాహుబలి – కంక్లూజన్ క్లైమాక్స్ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్స్ లో క్లైమాక్స్ షూటింగ్ సోమవారం (జూన్ 13) మొదలయింది. అదే రోజు రాజమౌళి ట్విట్టర్ లోని తన ఖాతాకు సంబంధించిన ప్రొఫైల్ పిక్ ను మార్చారు.

రెండు రోజుల క్రితం అదే పిక్చర్ అతని ఫేస్ బుక్ ప్రొఫైల్ పిక్ గా ప్రత్యక్షమైనది. దీంతో ఈ పిక్ పై చర్చ మొదలైంది. ఈ పిక్చర్ లోని అర్ధం ఏమిటని నెటిజన్లు అరా తీసారు. కొందరైతే తమకు తోచిన విధంగా వివరణ ఇచ్చారు. “ఇది మహిస్మతి రాజ ముద్రిక. అందులో రెండు గుర్రాలు ప్రభాస్, రానాలకు ప్రతీకలు, మధ్యలో సింహాసనం, దాని పైన కిరీటం, చుట్టూ కోట.

“అని ఓ అభిమాని చెప్పారు. మరో అభిమాని అది మహిస్మతి నాణెం గా చెప్పుకొచ్చాడు. చాల మంది రాజమౌళి క్రియేటివిటిని మెచ్చుకున్నారు. లోగో బాగుందని, ఆ చిహ్నం పై నున్న అక్షరాలు మరింత కొత్తగా ఉన్నాయని కీర్తించారు. వేల మంది ఈ పిక్చర్ పై స్పందించినా .. రాజమౌళి మాత్రం స్పందించలేదు. నెటిజనులు ఊహించిందే నిజముతుందా ? జక్కన్న నోరు విప్పుతాడా ? అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం దొరకవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus