దర్శకుడు సోమశేఖర్‌ ఇకలేరు

  • May 24, 2021 / 10:58 AM IST

కరోనా సినిమా పరిశ్రమలో మరొకరిని పొట్టనపెట్టుకుంది. ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మకు వరుసకు సోదరుడైన పి.సోమశేఖర్‌ ఇటీవల కరోనాతో కన్నుమూశారు. వర్మ రూపొందించిన వివిధ చిత్రాలకు సోమశేఖర్‌ ప్రొడక్షన్‌ బాధ్యతలు నిర్వర్తించారు. అందులో ‘రంగీలా’, ‘దౌడ్‌’‌, ‘సత్య’, ‘జంగిల్‌’, ‘కంపెనీ’ లాంటివి ఉన్నాయి. దాంతోపాటు సోమశేఖర్‌ హిందీలో ‘ముస్కురాకే దేఖ్‌ జరా’ అనే సినిమాను డైరెక్ట్‌ చేశారు కూడా. ఆ తర్వాత క్రమేణా సినిమాలకు దూరమయ్యారు. సోమశేఖర్‌ కొన్నాళ్లకు సినిమాల నుండి దూరమై వ్యాపారాల్లోకి వెళ్లారు.

మరోవైపు వివిధ కారణాల వల్ల గత కొంతకాలంగా రామ్‌గోపాల్‌వర్మకు దూరంగా ఉంటున్నారు. అయితే తన జీవితంలో కీలకమైన వ్యక్తుల్లో సోమశేఖర్‌ ఒకరని వర్మ చెబుతుండేవారు. సోమశేఖర్‌ను చాలా మిస్‌ అవుతున్నానని వర్మ చెప్తుండేవారు. సోమశేఖర్‌ మృతిపై బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ విచారం వ్యక్తం చేశారు. సోమశేఖర్‌ తన తల్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకునేవారని గుర్తు చేసుకున్నారు. కరోనా సోకిన తర్వాత కూడా తల్లి కోసం పరితపించారని చెప్పుకొచ్చారు. అయితే తన తల్లిని కాపాడగలిగారు కానీ.. తన ప్రాణాలు దక్కించుకోలేకపోయారని బోనీ కపూర్‌ అన్నారు. సోమశేఖర్‌ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపం తెలిపారు.

Most Recommended Video

టాలీవుడ్ స్టార్ హీరోల ఫేవరెట్ ఫుడ్స్ ఇవే..?
ఈ 10 సినిమాల్లో కనిపించని పాత్రలను గమనించారా?
2020 లో పాజిటివ్ టాక్ వచ్చినా బ్రేక్ ఈవెన్ కానీ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus