ప్రభాస్‌ బాలీవుడ్ ఎంట్రీ పై వచ్చిన రూమర్స్ ని ఖండించిన రోహిత్

  • July 22, 2017 / 12:15 PM IST

బాహుబలి విడుదలైనప్పటి నుంచి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. అతడితో ఫలానా స్టార్ డైరెక్టర్ సినిమా చేయబోతున్నాడు.. ఫలానా స్టూడియో అతడితో సంప్రదింపులు జరుపుతోంది.. అంటూ రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. ‘బాహుబలి-2’ విడుదల తర్వాత అవి మరింత పెరిగాయి. కరణ్ జోహార్ తో ప్రభాస్ ఒక ఒప్పందం చేసుకున్నాడని, అలాగే బాలీవుడ్ కామెడీ చిత్రాల దర్శకుడు రోహిత్ శెట్టి ప్రభాస్ హీరోగా ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి. ఐతే దీని గురించి కరణ్ ఏమీ మాట్లాడలేదు కానీ.. రోహిత్ మాత్రం ఈ రూమర్లపై స్పందించాడు.

తాను ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని అన్నాడు. తాను ఇంత వరకు ప్రభాస్‌ను ఎప్పుడూ కలవలేదని.. అతడితో ఎప్పుడు మాట్లాడలేదని.. తనతో సినిమా చేసే ఆలోచన తనకు లేదని చెప్పాడు. ఐతే ఈ వార్త విని ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం సంతోషిస్తున్నారు. ఎందుకంటే రోహిత్ కు దర్శకుడిగా పెద్ద పేరైతే ఉంది కానీ.. అతను తీసినవన్నీ రొటీన్ కామెడీ సినిమాలే. కాబట్టి ప్రభాస్‌తో తాను సినిమా చేయట్లేదని రోహిత్ అంటే మన జనాలు సంతోషించాలే తప్ప ఫీలవ్వాల్సిందేమీ లేదు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus