ఫోటోలు, వీడియోలతో తమ మధ్య ఉన్న బంధానికి హింట్లు ఇస్తూ సౌత్ ఇండస్ట్రీలో మరో కొత్త చర్చకు తెరలేపారు ఒక యువ జంట. ఈ విషయమై ప్రస్తుతం చాల వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్ చల్ చేసున్నాయి. ఇంతకీ ఎవరా జంట ? చూసేద్దాం రండి.
సౌత్ సినిమాల్లో సహజ నటనతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్. ప్రస్తుతం సినిమాలు, వెబ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది. వరుస సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తూ కెరీర్ పరంగా మంచి ఫామ్లో కొనసాగుతున్న ఈ నటి, గతంలో స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కిన చిత్రం ‘బైసన్’ లో కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలో ఆమెకు జోడీగా నటించిన యువ నటుడు ధృవ్ విక్రమ్.
ఆ సినిమా విడుదలైనప్పటి నుంచే వీరిద్దరి మధ్య స్నేహం కాస్తా రిలేషన్షిప్గా మారిందన్న గాసిప్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఒకరి పోస్టులకు మరొకరు రియాక్ట్ అవ్వడం, హార్ట్ ఎమోజీలు షేర్ చేయడం లాంటి చిన్న చిన్న విషయాలే ఈ వార్తలకు మరింత ఊతమిచ్చాయి. ఇటీవల వీరిద్దరూ వేర్వేరుగా షేర్ చేసిన ఫోటోలు, వీడియోల్లో ఒకే తరహా బ్యాక్డ్రాప్స్ కనిపించడంతో “ఇద్దరూ కలిసి వెకేషన్కు వెళ్లారా?” అన్న సందేహాలు మొదలయ్యాయి.
ఇలాంటి పరిస్థితి గతంలో విజయ్ దేవరకొండ – రష్మిక విషయంలోనూ కనిపించిందని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. అప్పట్లో కూడా అధికారిక ప్రకటన లేకపోయినా, ఫోటోలు మాత్రమే చాలామందికి సంకేతాలుగా మారాయి. అయితే అనుపమ, ధృవ్ విక్రమ్ మాత్రం ఈ రూమర్లపై ఇప్పటివరకు ఎలాంటి స్పందన ఇవ్వలేదు. వారి మౌనం వల్లే ఈ చర్చలు మరింత బలపడుతున్నాయని అభిమానులు భావిస్తున్నారు. నిజంగా ఇది స్నేహమా? లేక కొత్త ప్రేమకథ ఆరంభమా? అన్నది తెలియాలంటే ఈ జంట నుంచే స్పష్టత రావాల్సిందే. అప్పటివరకు ఈ ఫిల్మీ గాసిప్ సోషల్ మీడియాలో కొనసాగుతూనే ఉంటుంది.