చిరంజీవి నిర్ణయంతో షాకైన ఫ్యాన్స్?

  • July 4, 2019 / 04:10 PM IST

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘సైరా’ చిత్రం షూటింగ్ పూర్తయ్యింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇది మెగాస్టార్ 151 వ చిత్రం అందులోనూ ఆయన డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి.. ఆయన తనయుడు మెగా పవర్ స్టార్ రాంచరణ్ ఈ చిత్రాన్ని ఏమాత్రం ఖర్చుకు వెనుకాకుండా.. సుమారు 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు. ఇక మెగాస్టార్ కూడా తన పాత్రకి డబ్బింగ్ మొత్తం చెప్పేసారు. ఇది ఒక రికార్డు అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది.

అంతా బానే ఉంది. కానీ మెగాస్టార్ ఇంత త్వరగా డబ్బింగ్ పూర్తి చేయడానికి అసలు కారణం.. తన 152 వ చిత్రాన్ని కొరటాల శివ డైరెక్షన్లో చేయడానికే అని వార్తలు వచ్చాయి. డబ్బింగ్ పూర్తి చేసిన వారం రోజుల తరువాత కొరటాల సినిమా షూటింగ్ ప్రారంభించాలని మెగాస్టార్ భావించారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. ‘సైరా’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొత్తం చిరునే దగ్గరుండి చూడాలని ఫిక్సయ్యారట. దీంతో కొరటాల తో చేయబోయే సినిమాని వచ్చే నెల… అంటే ఆగష్టు లో తన పుట్టినరోజు అయిన 22 వ తేదీన మొదలుపెడదామని చెబుతున్నారట. ఇది మెగా ఫ్యాన్స్ కు నిజంగా బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus