సాహో రిలీజ్ విషయంలో స్పందించిన చిత్ర బృందం..!

  • March 20, 2018 / 09:57 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం “రన్ రాజా రన్” ఫేమ్ సుజీత్ డైరెక్షన్లో సాహో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. యువీ క్రియేషన్స్ బ్యానర్లో భారీ బడ్జెట్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా సాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ దుబాయ్ లో ప్లాన్ చేశారు. అందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత సినిమాకి కూడా ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపి కృష్ణ ఫిలిమ్స్ బ్యానర్లో నటించడానికి ఓకే చెప్పారు. కృష్ణం రాజు నిర్మించనున్న ఆ సినిమాని జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వం వహించనున్నారు.

ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ మూవీలో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఫిక్స్ అయినట్లు తెలిసింది. జూలై నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ఈ మూవీ సాహో కంటే ముందే థియేటర్లలోకి వస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం సాగుతోంది. హెవీ గ్రాఫిక్ వర్క్ ఉండడంతో సాహో కి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎక్కువ రోజులు సాగుతుందని, అందుకే రాధాకృష్ణ తో చేసే సినిమా ముందే రిలీజ్ అవుతుందని రూమర్ చక్కర్లు కొట్టింది. దీనిపై సాహో టీమ్ ఈరోజు స్పందించింది. హెవీ గ్రాఫిక్ వర్క్ ఉన్నప్పటికీ సాహో సినిమానే ముందుగా రిలీజ్ అవుతుందని స్పష్టం చేసింది. దీంతో రూమర్లకు బ్రేక్ పడింది

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus