అజ్ఞాతవాసిపై సాయి ధరమ్ తేజ్ కామెంట్

  • January 8, 2018 / 10:51 AM IST

నేటి హీరోలు, డైరెక్టర్లలో చాలామంది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు. ఆ అభిమానుల్లో సాయి ధరమ్ తేజ్ ఒకరు. సొంత మేనమామ అయినప్పటికీ ఒక స్టార్ గా పవన్ ని అభిమానిస్తారు. పవర్ స్టార్ సినిమాలు చూస్తూ పెరగడం వల్ల తన నటనపై అతని ప్రభావం ఉందని అనేక సార్లు చెప్పారు. ఇప్పుడు కూడా పవన్ నటించిన అజ్ఞాతవాసి సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 10 న రిలీజ్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యుల కోసం ప్రత్యేకంగా ఒకరోజు ముందుగానే షో వేస్తున్నారు. అయినా అభిమానుల మధ్యలో కూర్చొని విజిల్స్ వేస్తూ పవన్ సినిమా చూస్తే ఆ కిక్కే వేరప్పా.. అని సాయి ధరమ్ తేజ్ అంటున్నారు. రీసెంట్ గా మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయం చెప్పారు.

“ఒక అభిమానిగా అజ్ఞాతవాసి కోసం చూస్తున్నాను. ఈ సినిమాలో పాట బాగుంటుందా?, ఫైట్ బాగుంటుందా? అని ఆలోచించడం లేదు. అభిమానులతో కలిసి రిలీజ్ రోజు సినిమా చూడాలనే ఒక్క ఆలోచన మాత్రమే తనలో ఉంది. అంతేగాక అందరిలాగే నేను కూడా పవన్ స్క్రీన్ మీద ఏం చేస్తారు, ఎలా చేస్తారో చూడాలని ఆతృతగా ఉన్నాను. నాకు తెలిసి సినిమా వన్ మాన్ షోలాగనే ఉండబోతుంది” అని వివరించారు. హారిక అండ్ హాసిని బ్యానర్లో రాధా కృష్ణ నిర్మించిన ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus