సాయి ధరమ్ తేజ్ జవాన్ పై భిన్న కథనాలు!

  • November 24, 2017 / 08:10 AM IST

విజయాలతో ఉన్న సాయి ధరమ్ తేజ్ ని తిక్క సినిమా తిక్క వదిలించింది. ఆ తర్వాత చేసిన విన్నర్ గెలుపును ఇవ్వలేకపోయింది. నక్షత్రమైన హిట్ ట్రాక్ లోకి తీసుకుపోతుందనుకుంటే అది లేదు. సో మెగా హీరో ఆశలన్నీ జవాన్ సినిమాపైనే పెట్టుకున్నారు. బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. ఇది సినిమాపై అంచనాలను పెంచుతుందనుకుంటే.. నిరాశపరిచింది. సినిమా చూడాలనుకునేవారు కూడా వెనక్కి తగ్గినట్లు సమాచారం. కారణం ఏమిటంటే ట్రైలర్ కట్ అసలు బాగా లేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సినిమా కథను చెప్పకుండా ఊరించాల్సింది పోయి మూడు ముక్కల్లో సినిమా ఏంటో చెప్పేయడం వల్ల ఆ సినిమాపై క్రేజ్ తగ్గిపోయిందని వెల్లడించారు.

“ఆక్టోపస్ మిస్సైల్ ను సైన్యానికి దక్కకుండా తన చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటాడు విలన్. దాన్ని హీరో అడ్డుకుంటాడు.” ఇది స్టోరీ లైన్. దీనికి తోడు “యుద్ధం మొదలయ్యాక పక్కోడు పోయాడా.. వెనకోడు ఆగిపోయాడా..” అంటూ చెప్పే డైలాగ్,  సినిమా ఏంటనేది విషయాన్ని చెప్పకనే చెప్పేస్తోంది. అంతేకాదు విలన్ ఎవరో కూడా ముందే చెప్పేయడం తుస్ మనిపించింది. తమిళంలో అనేక విజయాలు అందుకున్న ప్రసన్న ఈ చిత్రం ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు. ఆ విషయంతోనైనా సినిమాపై క్రేజ్ తీసుకొస్తే బాగుండేదని సినీ విమర్శకులు భావిస్తున్నారు. ఇలా ట్రయిల్ రూపంలో తప్పటడుగు వేసిన జవాన్ థియేటర్లో ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus