ప్రభాస్ స్టయిల్ లో సాయి ధరమ్ తేజ్!

  • December 2, 2017 / 11:23 AM IST

ఏమున్నాడురా బాబూ.. అనే డైలాగ్ వినగానే మనకి మిర్చి సినిమా గుర్తుకు వస్తుంది. అందులో ప్రభాస్ ని చూసి అనుష్క ఈ డైలాగ్ చెబుతుంది. హీరోయిన్ మాత్రమే కాదు క్యాజువల్ డ్రస్ లో స్టైల్ గా ఉన్న ప్రభాస్ ని చూసిన ప్రతి అమ్మాయి ఇలానే అనుకుంటుంది. ప్రస్తుతం ఇదే డైలాగ్ సాయి ధరమ్ తేజ్ ని చూసి అనుకుంటున్నారు. జవాన్ సినిమా చూసిన వారు సాయి ధరమ్ ని చూసి ప్రభాస్ లా ఉన్నాడని కితాబు ఇస్తున్నారు. ఇదివరకే చిత్రాలకంటే సాయి ఇందులో డిఫెరెంట్ గా కనిపించడమే అందుకు కారణం. అది కూడా మిర్చి లో ప్రభాస్ స్టైల్ లాగా ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

పిల్ల నువ్వు లేక జీవితంతో అడుగు పెట్టిన తేజు.. మామయ్య పోలికలు ఉండడం.. అంత పవర్ గా డైలాగులు చెప్పడంతో మెగా ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నారు. అదే ఫాలో అవుతుండడంతో ఆడియన్స్ రొటీన్ గా ఫాలో అయ్యారు. అందుకే బీవీఎస్ రవి దర్శకత్వంలో తెరకెక్కిన జవాన్ లో టోటల్ గా లుక్ మార్చి ప్రశంసలు అందుకుంటున్నారు. జవాన్‌ త‌ర్వాత సాయి ధరమ్ తేజ్… వి వి వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దీని తర్వాత క‌రుణాక‌ర‌న్ డైరెక్ష‌న్‌లో సినిమా చేయ‌బోతున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత గీతా ఆర్ట్స్‌, మైత్రీ మూవీస్ బ్యాన‌ర్ల‌లో సినిమాలు చేయ‌బోతున్నారు. ఈ సినిమాలతో స్టార్ హీరో హోదా పొందాలని సాయి ధరమ్ తేజ్ తపిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus