సాయి ధరమ్ తేజ్, నిహారిక పెళ్ళికి ఒకే చెప్పిన పెద్దలు

  • May 8, 2017 / 01:43 PM IST

మెగా ఫ్యామిలీ నుంచి హీరో, హీరోయిన్లుగా నిరూపించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌, నిహారికలు త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నారా?, బావ మరదళ్ల పెళ్ళికి పెద్దలు ఒకే చెప్పారా?…. అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ఒక మనసు సినిమా ద్వారా హీరోయిన్ గా నిరూపించుకున్న నాగబాబు కుమార్తె నిహారిక, వరుస విజయాలతో సుప్రీం హీరో అనిపించుకున్న సాయి ధరమ్‌ తేజ్‌కు త్వరలో వివాహం జరగనున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో అయితే ఈ వార్త సూపర్ ఫాస్ట్ గా దూసుకుపోతోంది.

చిరంజీవి, నాగబాబుల సోదరి విజయదుర్గ కుమారుడైన సాయి ధరమ్‌ తేజ్‌ కి నిహారికకు ఇచ్చేందుకు మెగా బ్రదర్స్ సంతోషంగా ఉన్నారని సమాచారం. ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ మెగా అభిమానులను మాత్రం ఆనందంలో ఉన్నారు. వారి సంతోషం రెట్టింపు అవ్వాలంటే తేజు, నిహారిక పెళ్లిపై మెగా కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus