సంచలన కామెంట్స్ చేసిన సాయి ధరమ్ తేజ్

  • February 23, 2018 / 07:23 AM IST

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తన నటనతో సుప్రీం హీరో అనిపించుకున్నారు. ఎంతో ఉత్సాహంగా డ్యాన్సులు చేసి అదరగొడుతున్నారు. అతను నటించిన రేయ్ నిరాశపరిచినా, పిల్ల నువ్వులేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్ సినిమాలు విజయం సాధించాయి. ఆ తర్వాత తిక్క, విన్నర్, నక్షత్రం, జవాన్, ఇంటలిజంట్ సినిమాలు ఫెయిల్ అయి నిరాశ పరిచాయి. ఇప్పుడు కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. ఈ మధ్య అతనిపై కొన్ని రూమర్లు వచ్చాయి. చిరంజీవి పేరు చెప్పుకుంటూ అవకాశాలు దక్కించుకుంటున్నట్లు గాసిప్ చక్కర్లు కొట్టాయి. దీనిపై సాయి ధరమ్ తేజ్ ఘాటుగా స్పందించారు.

“మేనమామ చిరంజీవి పేరు చెప్పుకుంటూ తిరగాల్సిన అవసరం నాకు లేదు. చిరంజీవి ఆశీస్సులుంటే చాలు” అని చెప్పారు. తాను మొదటి నుంచి ఛాన్స్ ల కోసం మెగాస్టార్ పేరు చెప్పుకోలేదని వెల్లడించారు. తన తొలి సినిమా ఛాన్స్ ఎలా వచ్చిందో వివరించారు. “నేను మనోజ్ ఇంట్లో క్రికెట్ ఆడుతుండగా దర్శకుడు వైవీఎస్ చౌదరి నన్ను చూసారు. వెంటనే సినిమాలో చేస్తావా..? అని అడిగారు. ఆ సమయంలో వైవీఎస్ చౌదరికి నేను ఎవరో తెలియదు” అని ఆనాటి సంగతిని గుర్తుకు తెచ్చుకున్నారు. ఇప్పటికీ తనపై నమ్మకంతో దర్శకనిర్మాతలు ఛాన్స్ లు ఇస్తున్నారని తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus