Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి తేజ్ ఆ డౌట్లన్నీ క్లియర్ చేయబోతున్నాడట…!

  • November 23, 2021 / 08:10 PM IST

వినాయక చవితి రోజునాడు ఎవ్వరూ ఊహించని విధంగా బైక్ యాక్సిడెంట్ కు గురయ్యాడు మెగా మేనల్లుడు సాయి తేజ్.ఆ సంఘటన అందరినీ కలచివేసింది. కానీ సాయి తేజ్ యాక్సిడెంట్ పై రకరకాల వార్తలు వచ్చాయి. రాష్ డ్రైవింగ్ అని గతంలో అతని పై పోలీస్ కేసు బుక్కయ్యిందని ఇలా రకరకాల కామెంట్లు వచ్చాయి.కానీ వాటిలో నిజం లేదని స్వయంగా పోలీసులే రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. అటు తర్వాత అతనికి కాలర్ బోన్ సర్జెరీ కూడా జరిగింది.

దాంతో 6,7 వారాలు అతనికి బెడ్ రెస్ట్ కావాలని వైద్య నిపుణులు సూచించడంతో అతను ఇప్పటివరకు బయటకి రాలేదు.అతను చేయబోయే తర్వాతి సినిమాల షూటింగ్ లను కూడా 2022కి పోస్ట్ పోన్ చేసాడు. ఇటీవల మెగా హీరోలందరితో సాయి తేజ్ కలిసి దిగిన ఫోటో కూడా ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా…యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్.. తొలిసారి మీడియా ముందుకు రాబోతున్నాడట. వివరాల్లోకి వెళితే…

సాయి తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ ఇటీవల విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఇందులో సాయి తేజ్ నటన అందరినీ ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని జీ5 లో 26వ తేదీన విడుదల చేయబోతున్నారు. అందుకోసం ఓ ప్రెస్ మీట్ ను కూడా నిర్వహించబోతున్నారట. ఈ ప్రెస్ మీట్ లో హీరో సాయి తేజ్ కూడా హాజరుకాబోతున్నాడని తాజా సమాచారం.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus