Sai Dharam Tej: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సాయితేజ్ ట్వీట్!

  • June 30, 2022 / 11:26 AM IST

టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన సాయితేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. కార్తీక్ దండు డైరెక్షన్ లో సాయితేజ్ హీరోగా ఒక సినిమా తెరకెక్కనుండగా రుద్రవనం అనే టైటిల్ ను ఈ సినిమాకు పరిశీలిస్తున్నారని సమాచారం అందుతోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుండగా సుకుమార్, బీవీఎస్ఎన్ ప్రసాద్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు సాయితేజ్ వినోదాయ సిత్తం రీమేక్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

వినోదాయ సిత్తం రీమేక్ భారీ బడ్జెట్ తో తెరకెక్కనుండగా సముద్రఖని ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు. పవన్, సాయితేజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. వినోదాయ సిత్తం రీమేక్ కు తెలుగులో ఏ టైటిల్ ను ఫిక్స్ చేస్తారో చూడాల్సి ఉంది. సాయితేజ్ వరుస ప్రాజెక్ట్ లతో బిజీ కావడంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే తాజాగా సాయితేజ్ సోషల్ మీడియా వేదికగా ఒక ట్వీట్ చేయగా ఆ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.

బాలీవుడ్ మూవీ రక్షబంధన్ ట్రైలర్ రిలీజ్ కాగా ఈ ట్రైలర్ గురించి సాయితేజ్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అక్కాచెల్లెళ్ల కోసం మనం ప్రాణాలైనా ఇచ్చేయొచ్చని సాయితేజ్ పేర్కొన్నారు. రక్షాబంధన్ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత అక్షయ కుమార్ సర్ పై నాకు మరింత గౌరవం పెరిగిందని సాయితేజ్ చెప్పుకొచ్చారు. బ్రదర్స్ సిస్టర్స్ మధ్య బంధాన్ని బాగా చూపించిన ఈ సినిమా బృందానికి థ్యాంక్స్ అని సాయితేజ్ పేర్కొన్నారు.

జీ స్టూడియోస్ తో ఉన్న అనుబంధం వల్లే సాయితేజ్ ఈ సినిమా ట్రైలర్ గురించి పాజిటివ్ గా కామెంట్లు చేసి ఉండవచ్చని నెటిజన్లు భావిస్తున్నారు. సాయితేజ్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సాయితేజ్ ఒక్కో సినిమాకు 8 నుంచి 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని బోగట్టా.

విరాటపర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’, ‘అంటే..’ తో పాటు ఎక్కువ నిడివితో వచ్చిన లేటెస్ట్ సినిమాల లిస్ట్..!
‘2.0’ టు ‘విక్రమ్’ తమిళ్ లో భారీ కలెక్షన్లు రాబట్టిన 10 సినిమాల లిస్ట్..!
ఎన్టీఆర్, నాగ చైతన్య.. టు కీర్తి సురేష్, ‘గుండమ్మ కథ’ రీమేక్ కు సూట్ అయ్యే 10 మంది స్టార్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus