కరోన వైరస్ స్పెషల్ అవైర్నెస్ షార్ట్ ఫిలింలో నటించిన సాయి కుమార్, ఆది సాయి కుమార్!

  • April 9, 2020 / 09:27 PM IST

కరోనా దెబ్బ ఎంత తీవ్రంగా ఉందో తెలిసిందే. ఈ వైరస్ ధాటికి ప్రపంచం చిగురుటాకులా వణికిపోతోంది. దీంతో వైరస్ అరికట్టడానికి ప్రపంచమంతా ఇప్పుడు కృషి చేస్తుంది. అందులో భాగంగా ప్రభుత్వం తాను చేయాల్సిన ప్రయత్నాలు చేస్తోంది. కాగా తెలుగు సినిమా ఇండస్ట్రీ ముందుకొచ్చింది, కరోనాను కట్టడి చేసే పనిలో భాగంగా తమ వంతుగా డైలాగ్ కింగ్ సాయి కుమార్ ఇటీవల 5 లక్షల నాలుగు రూపాయలను సినీ కార్మికుల సంక్షేమం కోసం, 2 లక్షలు డబ్బింగ్ యూనియన్ కు విరాళంగా ఇచ్చారు. ఇప్పుడు తన కొడుకు ,కూతురు తో కలిసి కరోన వైరస్ అవైర్నెస్ మీద ఒక షార్ట్ ఫిలిం తీసారు.

కరోన మహమ్మరిని నియంత్రించడానికి డాక్టర్స్, పోలీస్ డిపార్ట్మెంట్ వారు,పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిది, వారికి సెల్యూట్ చేస్తూ తీసిన ఈ షార్ట్ ఫిలిం కు మంచి రెస్పాన్స్ వస్తోంది.. సాయి కుమార్ అతని కుమారుడు ఆది సాయి కుమార్, కుమార్తె డాక్టర్ జ్యోతిర్మయి కవిపురపు ఈ లఘు చిత్రంలో కలిసి నటించడం విశేషం. జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ షార్ట్ ఫిలింను నిర్మించడం జరిగింది.

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus