నాగశౌర్య నా వల్ల బాధపడి ఉంటే వెరీ సారీ.!

  • April 23, 2018 / 07:20 AM IST

అసలు శౌర్య-సాయిపల్లవి నడుమ ఏం జరిగిందనే విషయం ఇప్పటివరకూ ఎవరికీ క్లారిటీ లేదు కానీ.. సాయిపల్లవిని ఒక టీవి చానల్ ఇంటర్వ్యూలో శౌర్య ‘ఆమెకు హెడ్ వెయిట్ ఎక్కువ’ అనడం చర్చనీయాంశం అయ్యింది. ఆ తర్వాత “కణం” ప్రమోషన్స్ విషయంలో శౌర్య మొండి చూపడం చెన్నైలో జరిగిన ఆడియో రిలీజ్ ఈవెంట్ కి మాత్రమే కాక హైద్రాబాద్ లో జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ కి కూడా శౌర్య తప్ప టీం మెంబర్స్ అందరూ హాజరవ్వడం పలు ప్రశ్నలకు దారితీసింది. ముందు అందరూ సాయిపల్లవి “కణం” షూటింగ్ టైమ్ లో తక్కువగా చూడడమే కారణం అనుకొన్నారు. తర్వాత ఇంటర్నెట్ లో పలు కారణాలు హల్ చల్ చేశాయి. కట్ చేస్తే.. అసలు రీజన్ ఎంటనేది ఏప్రిల్ 27న “కణం” విడుదలను పురస్కరించుకొని పాత్రికేయులతో ముచ్చటించిన సాయిపల్లవి ఈ విషయమై ఎట్టకేలకు నోరు విప్పింది. “నేను షూటింగ్ టైమ్ లో సన్నివేశానికి సంబంధించిన డైలాగ్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని, ఆ సమయంలో శౌర్యను పెద్దగా పట్టించుకొనేదాన్ని కాదు.

అలాగే.. శౌర్య డైలాగ్స్ ప్రిపేర్ అయ్యే టైమ్ లో నేను సైలెంట్ గా ఉండేదాన్ని. సో, నాకు తెలిసి నేను అలా సైలెంట్ గా ఉండడాన్ని శౌర్య తప్పుగా అనుకొన్నాడేమో. అందుకే హార్ట్ అయ్యి ఉంటాడు తప్పితే మేము ఇద్దరం గొడవ పడింది కూడా లేదు. ఒకవేళ శౌర్య నా వల్ల హార్ట్ అయ్యి ఉంటే మాత్రం మీడియా సాక్షిగా సారీ చెబుతున్నాను. ఆఖరికి నేను శౌర్యకి కాల్ చేసి మరీ సారీ చెబుదామనుకొన్నాను కానీ.. తన మేనేజర్ కానీ తన ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాకు అవకాశం ఇవ్వలేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus