Sai Pallavi: గార్గి సినిమాకు ఏడాది పూర్తి… సాయి పల్లవి పోస్ట్ వైరల్ !

  • July 17, 2023 / 03:00 PM IST

సౌత్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నేచురల్ బ్యూటీగా చాలా సహజసిద్ధంగా నటిస్తూ ఈమె నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు..ఇక సాయి పల్లవి కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ ఇండస్ట్రీలో ముందుకు కొనసాగుతున్నారు. ఇక 2022వ సంవత్సరంలో ఈమె నటించినటువంటి విరాటపర్వం, గార్గి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఇలా ఈ సినిమాల తర్వాత సాయి పల్లవి ఎలాంటి సినిమాలను ప్రకటించకపోవడంతో ఈమె సినిమా ఇండస్ట్రీకి దూరమవుతారని అందరూ భావించారు. అయితే అవన్నీ రూమర్స్ అని ఖండిస్తూ సాయి పల్లవి తమిళ హీరో శివ కార్తికేయన్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఇకపోతే సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్ గా ఉండని సాయి పల్లవి తన సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ మాత్రం అభిమానులతో పంచుకుంటారు.

తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తాను నటించిన గార్గి సినిమా ఏడాది పూర్తి చేసుకోవడంతో మరోసారి ఈ సినిమాని గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ వైరల్ గా మారింది. గార్గి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది పూర్తయింది ఈ సినిమాలోని నా పాత్ర సినిమాలపై మరింత ప్రేమ కలిగేలా చేసింది అంటూ ఈ సందర్భంగా సాయి పల్లవి చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

ఇక సాయి పల్లవి (Sai Pallavi) ప్రస్తుతం అమర్నాథ్ యాత్రలో ఉన్న విషయం మనకు తెలిసిందే. తన ఫ్యామిలీతో కలిసి ఈ యాత్రకు వెళ్లినటువంటి ఈమె యాత్రకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు.

పాత్ర కోసం ఇష్టాలను పక్కన పడేసిన నటులు వీళ్లేనా..!

సీరియల్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్ తెలిస్తే మతిపోతోంది !
నాయకుడు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus