సాయి పల్లవి పై మండిపడ్డ నేటిజన్లు ఫైర్… కారణం అదే..?

  • May 31, 2019 / 02:13 PM IST

‘ఫిదా’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది మలయాళ బ్యూటీ సాయి పల్లవి. ఈ చిత్రంతో ఆమెకు ఎనలేని క్రేజ్ వచ్చింది. తరువాత ఆమె నాని తో నటించిన ‘ఎం.సి.ఏ’ చిత్రం కూడా పెద్ద హిట్టవ్వడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. తరువాత తెలుగు, తమిళ భాషల్లో వరుస ఆఫర్లు ఈమెకు క్యూ కడుతున్నాయి. కానీ ఈమె మాత్రం ఆచి తూచి సినిమాల్ని ఎంచుకుంటుంది. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే ఏమాత్రం సినిమాల్ని ఒప్పుకోవట్లేదు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈమె పెద్దగా యాక్టివ్ గా ఉండదు. అలాంటి ఈమె సడన్ గా చాట్ సెషన్ పెడుతున్నట్టు చెప్పుకొచ్చింది. తన ‘ఎన్జీకే’ ప్రమోషన్ కోసం ఇలా చాట్ సెషన్ పెట్టబోతుందని అందరూ అనుకున్నారు.

దీంతో వేలాది ట్వీట్ల రూపంలో ప్రశ్నలు వచ్చాయి. కానీ సాయి పల్లవి మాత్రం 6,7 ప్రశ్నలకు మాత్రమే జవాబులు ఇచ్చి జంప్ అయ్యింది. దీంతో నేటిజన్లు తిట్ల పురాణం మొదలెట్టారు. ‘మాట్లాడుకుందామని మోసం చేస్తావా’ అంటూ మండిపడ్డారు. దీంతో వారికి సాయి పల్లవి క్షమాపణలు చెప్పింది.’మరోసారి కలుద్దాం ‘ఎన్జీకే’ చిత్రాన్ని ఎంజాయ్ చేయండి’ అంటూ చెప్పి మళ్ళీ జంప్ అయ్యింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus