కొత్త అవతారం ఎత్తనున్న రష్మిక మందన..!

  • March 22, 2020 / 10:05 PM IST

ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన 3 ఏళ్లలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది రష్మిక మందన. అందులోనూ ఈమె నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్లే కావడంతో ఈమె పై గోల్డెన్ లెగ్ అనే ముద్ర కూడా పడిపోవడంతో దర్శక నిర్మాతలు ఈమె కాల్షీట్ల కోసం క్యూలు కట్టేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటికే ‘సరిలేరు నీకెవ్వరు’ ‘భీష్మ’ రెండు సూపర్ హిట్లందుకుంది రష్మిక. ఇప్పుడు అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రంలో కూడా హీరోయిన్ గా నటించడానికి రెడీ అవుతుంది. ఇదిలా ఉంటే.. ఈమె ఓ విషయంలో కాజల్, సమంతలనే వెనక్కినెట్టేలా కనిపిస్తుంది.

అసలు మ్యాటర్ ఏమిటంటే.. హీరోయిన్లు నిర్మాణం వైపు మక్కువ చూపడం చాలా తక్కువ. అది చాలా రిస్క్ అని వారు భావిస్తుంటారు. గతంలో కాజల్, సమంత లు ఆ దిశగా అడుగులు వేయబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటికీ వాళ్ళు… ఈ టైములో ఇది అవసరమా అనే ఆలోచనలోనే ఉన్నారని తెలుస్తుంది. అయితే మన రష్మిక మాత్రం నిర్మాతగా మారాలని ఆశ పడుతున్నట్టు తెలుస్తుంది. ‘3 ఏళ్లలోనే ఐటీ రైడ్ లు జరిగేంత సంపాదించిందా రష్మికా’.. అనే అనుమానాలు ఉన్న టైములో.. ఆమె ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం పై చర్చలు మొదలయ్యాయి. అంతేకాదు మంచి కథ ఉంటే చెప్పమని రైటర్లకు చెప్పిందట ఈ బ్యూటీ. మరి రష్మిక ప్రయత్నాలు ఎంత వరకూ వర్కౌట్ అవుతాయో చూడాలి..!

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus