‘చైసామ్’ సరికొత్త ప్రయోగం..?

  • July 12, 2019 / 02:46 PM IST

ఎంత పెద్ద స్టార్లకైనా ఒక్కోసారి నిర్మాతలు రిస్క్ అనిపించిన కథని ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రారు. ఈ క్రమంలో నచ్చిన కథని వదులుకోవడం ఇష్టం లేకో.. లేదా ఆ కథ బలమైన నమ్మకం ఉండబట్టో.. ఆ స్టార్లే నిర్మాతలుగా మారి సినిమాలు చేస్తుంటారు. పవన్ కళ్యాణ్ సర్ధార్ గబ్బర్ సింగ్, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ వంటి సినిమాలు కూడా ఈ కోవకి చెందినవే. సినిమాలు ప్లాపైనా వారికి నచ్చిన కథ చేశామనే సంతృప్తి వారు పొందుతుంటారు. అలా అనే కాదు సొంత లాభాల కోసం కూడా సినిమాలు నిర్మించేవారుంటారు. ఈ లిస్ట్ లో కింగ్ నాగార్జునను ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అయితే మామూలు కథను కూడా అద్భుతంగా రూపొందిస్తుంటారు నాగార్జున. ‘అన్నపూర్ణ స్టూడియోస్’ బ్యానర్ పై ఆయన ప్రొడ్యూస్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. వర్కౌట్ అవ్వనివి క్లాసిక్స్ గా మిగిలాయి. కానీ కథ నచ్చితే ఎంత రిస్కయినా చేయడానికి నాగార్జున ఎప్పుడూ ముందుంటారు. ఇక నాగార్జున బాటలోనే ఆయన పెద్ద కొడుకు, కోడలు అడుగులు వేస్తున్నారు .

అవును ‘చైసామ్’ త్వరలో నిర్మాతలుగా మారబోతున్నారట. ఇటీవల సమంత ‘ఓ బేబీ’ చిత్రంతో సూపర్ హిట్టందుకుంది. ఈ క్రమంలో నెక్స్ట్ సొంతంగా ఓ సినిమా నిర్మించాలని డిసైడ్ అయ్యిందట. నాగ చైతన్య కూడా సమంత నిర్ణయానికి ఓకే చెప్పారట. దీంతో వీరిద్దరూ కలిసి ఓ సినిమా నిర్మించాలనుకుంటున్నారట. ఆ చిత్రానికి నందినీ రెడ్డి దర్శకురాలని సమాచారం. ‘ఓ బేబీ’ షూటింగ్ సమయంలో నందిని రెడ్డి.. సమంతకు సస్పెన్స్ థ్రిల్లర్ లైన్ చెప్పిందట. ఆ లైన్ నచ్చడంతో సమంత ‘వెంటనే ఫుల్ స్క్రిప్ట్ రెడీ చెయ్యి… మనం కచ్చితంగా చేద్దాం’ అని చెప్పిందట. అందుకే ఇలా సొంత బ్యానర్ ప్లాన్ చేశారట ‘చైసామ్’.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus