వెండితెరపై కలిసి నటించనున్న భార్య భర్తలు

  • February 10, 2018 / 11:44 AM IST

వెండితెరపై హిట్ పెయిర్ గా నాగ చైతన్య, సమంత నిరూపించుకున్నారు. వారిద్దరూ కలిసి నటించిన ‘ఏ మాయ చేశావే’ సినిమా సూపర్ హిట్ అయింది. ‘ఆటోనగర్ సూర్య’ నిరాశపరిచినప్పటికీ ‘మనం’ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. ఆ తర్వాత వీరిద్దరిని కలిపి సినిమా తీయాలని చాలామంది అనుకున్నారు. కుదరలేదు. భార్య భర్తలుగా మారిన తర్వాత ఈ జోడి వెండితెరపై కనిపిస్తే చాలా క్రేజ్ ఉంటుందని మారుతి గట్టిగానే ప్రయత్నించారు. కానీ చివరికి తన సినిమాలో అను ఇమ్యానుయేల్ ని తీసుకున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ పెయిర్ ఓ సినిమాలో కలిసి నటించనున్నట్లు తెలిసింది.

“నిన్ను కోరి” వంటి సినిమా చేసిన శివ నిర్వాణ‌ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత కలిసి నటించనున్నట్లు ఫిలిం నగరవాసులు చెప్పారు. శివ చెప్పిన రొమాంటిక్ లవ్ స్టోరీ చైతూకి బాగా నచ్చిందంట. హీరోయిన్ గా సమంత అయితే ఆ కథకి మరింత బలం చేకూరుతుందని భావించడం.. సమంతకి శివ నిర్వాణ‌ కథ వినిపించడం.. ఆమెకు కూడా తన రోల్ నచ్చడంతో ఒకే చెప్పినట్లు టాక్. కోన వెంక‌ట్, దాన‌య్య సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus