సమంత నుదుటిన కుంకుమ బొట్టు

  • September 26, 2016 / 07:25 AM IST

టాలీవుడ్ క్రేజీ నటి సమంత ప్రేమ విషయం బయటికి వచ్చినప్పటినుంచి.. ఆమె ఏమిచేసినా సెన్సేషన్ అవుతోంది. తాజాగా స్యామ్ నుదుటిన కుంకుమ బొట్టుకోవడం చర్చనీయాంశమైంది. అక్కినేని నాగ చైతన్యతో కలిసి ఒక పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.  ఇందులో చైతన్య, సమంత ఇద్దరూ కుంకుమ బొట్లు పెట్టుకుని పక్కపక్కనే చాప మీద కూర్చున్నారు. పక్కన నాగార్జున కూడా ఉన్నారు.

దీంతో నెటిజనులు సమంత హిందూ మతంలోకి మారిందని ఫిక్స్ అయిపోయారు. వాళ్ల వాదనకు మరింత బలం సమకూర్చేలా ఫొటోలో ప్రేమ జంట వెనకాల కొందరు పురోహితులు కూడా నిలబడి ఉన్నారు. మతం మారినట్లు  చైతు, సమంత చెప్పకపోయినా ఫొటోలే స్పష్టం చేస్తున్నాయని క్లారీటీ ఇస్తున్నారు. ఇక వీరి పెళ్లి విషయానికి వస్తే .. ఈ ఏడాది ఉండదని కింగ్ నాగార్జున, సమంత వివిధ సందర్భాల్లో  చెప్పారు. వచ్చే ఏడాది స్యామ్ కోరిక మేరకు పెళ్లి మొదట చర్చిలో జరగనుంది, ఆ తరవాత హిందూ మతం ప్రకారం పెళ్లి పీఠలపై కూర్చోనున్నారు.  ఆ శుభ సందర్భం కోసం అక్కినేని అభిమానులందరూ ఎదురు చూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus