Samantha: గుణ శేఖర్ ను చూసి సమంత కన్నీళ్ళు పెట్టుకున్న వేళ..!

  • January 9, 2023 / 03:15 PM IST

‘యశోద’ వంటి బ్లాక్ బస్టర్ మూవీ తర్వాత సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం ‘శాకుంతలం’. ఇది ఒక మైథలాజికల్ డ్రామా. కాళిదాస రచించిన అభిజ్ఞాన శాకుంతలం.. ని ఆధారం చేసుకుని దర్శకుడు గుణ శేఖర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. నీలిమ గుణ, దిల్ రాజు సంయుక్త నిర్మాణంలో పాన్ ఇండియా మూవీగా ‘శాకుంతలం’ రూపొందింది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ మూవీ ఫిబ్రవరి 17న ఏకకాలంలో విడుదల కాబోతుంది.

ఈ నేపథ్యంలో టీజర్ లాంచ్ వేడుకను ఈరోజు హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు సమంత కూడా హాజరయ్యింది. ఆమె మీడియా ముందుకు వచ్చి చాలా కాలం అయ్యింది. మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడటంతో ఆమె హాస్పిటల్ కు, ఇంటికి మాత్రమే పరిమితమైంది. అయితే ‘శాకుంతలం’ ప్రమోషన్స్ కు ఆమె చురుగ్గా పాల్గొనాలని భావించి ఆమె టీజర్ లాంచ్ ఈవెంట్ కు వచ్చింది. ఈ నేపథ్యంలో టీజర్ లాంచ్ అనంతరం దర్శకుడు గుణశేఖర్ సినిమా గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యాడు.

ఈ సినిమా సక్సెస్ మేజర్ క్రెడిట్ అంతా దిల్ రాజుకి చెల్లుతుందని..! అలాంటి పెద్ద వ్యక్తి తమ వెంట ఉండి ‘శాకుంతలం’ లాంటి అద్భుతమైన చిత్రాన్ని విజువల్ వండర్ గా నిలపగలిగామని గుణశేఖర్ చెప్పుకొచ్చారు. సాధారణంగా గుణశేఖర్ సినిమా అంటేనే డబ్బులు ఎక్కువ పెట్టిస్తాడు అని అంతా అనుకుంటారని… ఓ పక్కన ఫన్నీగా చెబుతూనే.. ఆ వెంటనే ఎం.ఎస్. రెడ్డి, అశ్వినీదత్, యం.యస్.రాజు..

ఇప్పుడు దిల్ రాజు ఇలాంటి ఫ్యాషన్ ఉన్న నిర్మాతల వల్లనే ఇలాంటి సినిమాలు తీయగలుగుతున్నాను అంటూ చెబుతూ గుణశేఖర్ ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకున్నాడు. గుణశేఖర్ ను చూసి సమంత కూడా కన్నీళ్లు పెట్టుకుంది. ‘శాకుంతలం’ మేకింగ్ అలాంటి ఎమోషనల్ జర్నీ అని సినిమా కచ్చితంగా విజయం సాధిస్తుంది అని గుణశేఖర్ ఈ సందర్భంగా తెలియజేశాడు.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus