సమంత పై మరో పిడుగు..!!

  • July 27, 2016 / 01:16 PM IST

తమిళ దర్శకుడు ఏ.ఎల్.విజయ్, హీరోయిన్ అమలా పాల్‌ ఇద్దరు ప్రేమించుకొని జూన్ 12, 2014 న పెళ్లిచేసుకున్నారు. కొంతకాలం వరకు వీరి కాపురం కలహాలు లేకుండానే సాగింది. కానీ గత కొంత కాలంగా ఈ జంట విడాకులు కావాలని కోర్టు చుట్టూ తిరుగుతోంది. వీరు విడిపోవాలనుకోవడానికి ప్రధాన, ప్రత్యక్ష కారణం అమల పాల్ పెళ్లి అయినా తర్వాత నటనకు స్వస్తి పలుకక పోవడం. పరోక్ష కారణం సమంత అని కోలీవుడ్ వర్గాల వారు కోడై కూస్తున్నారు. అమల సినిమాలో నటిస్తుండడం విజయ్ తల్లిదండ్రులకు అసలు నచ్చడం లేదు.

పెళ్లి అయినా కొత్తలో అత్తమామలు కోడలికి సున్నితంగా చెప్పిచూసారు. కానీ అమలలో  మార్పురాలేదు. రీసెంట్ గా తమిళ స్టార్‌ హీరో ధనుష్‌ చిత్రం ‘వాడా చెన్నై’ నుంచి సమంత తప్పుకుంది. ఆ అవకాశాన్ని అమలా పాల్ అందిపుచ్చుకుంది. కాబోయే భర్త కోసం సమంత సినిమాను వదులుకుంది, సొంత భర్త చెబుతున్నా వినకుండా అమలా ధనుష్ జోడి కట్టడం పై విజయ్ సీరియస్ అయ్యాడు. తల్లి దండ్రులతో కలిసి విడాకుల కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నాడు.

అమలా పాల్ కు ఆమె కుటుంబం అండగా నిలవడంతో విడాకులకు సై అంటోంది. విజయ్ సన్నిహిత వర్గాల వారు మాత్రం సమంత పచ్చని కాపురంలో చిచ్చు పెట్టిందని చెబుతున్నారు. ఆమె సినిమా నుంచి తప్పుకోకుంటే అమల, విజయ్ ల మధ్య గొడవ పెద్దది అయేది కాదని బాధపడుతున్నారు. దీనిపై ఎలా స్పందించాలో తెలియక స్యామ్ తల పట్టుకుని మౌనంగా ఉండిపోయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus