సాయి పల్లవిని తప్పించి సమంతను తీసుకున్నారు.!

  • March 26, 2018 / 12:59 PM IST

సాయి పల్లవితో పోల్చుకుంటే సమంత సీనియర్ హీరోయిన్. టాలీవుడ్ స్టార్ హీరోలతో నటించింది. అనేక కమర్షియల్ హిట్ అందుకుంది. పెళ్లి అయినప్పటికీ మహానటి, రంగస్థలం, ఇరంబు తిరై సినిమాలు పూర్తి చేసి యూటర్న్ అనే తెలుగు చిత్రంతో పాటు రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. డేట్స్ కారణంగానో.. పారితోషికం వల్లనో సమంతని తొలగించి కొత్త హీరోయిన్ ని రీప్లేస్ చేసారంటే ఆశ్చర్యం లేదు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. సాయి పల్లవిని తప్పించి సమంతను తీసుకున్నారు. ఎందుకలా అంటే… . ప్రముఖ నటుడు కె.భాగ్యరాజ్ తనయుడు శంతను భాగ్యరాజ్ నటుడిగా సక్సస్ అయ్యారు. డైరక్టర్ గా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

దర్శకుడు మిస్కిన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శంతను భాగ్యరాజ్ హీరోగానూ చేస్తున్నారు.   హార‌ర్ నేపథ్యంలో సాగే ఇందులో ముఖ్యమైన పాత్రలకు నిత్యామీనన్, సాయి పల్లవిలను సెలక్ట్ చేశారు. త్వరలో షూటింగ్ కి వెళ్లనున్న సినిమా కోసం సాయి పల్లవి ఎక్కువ రెమ్యునరేషన్ అడిగిందట. దీంతో షాక్ తిన్న మిస్కిన్ సాయి పల్లవి ప్లేస్ లో సమంతను తీసుకున్నట్టు కోలీవుడ్ వర్గాలు తెలిపాయి. ఎన్ని హిట్లు అందుకున్నా కొత్త హీరోయిన్ మాదిరిగా సమంత నిర్మాతలకు, దర్శకులకు సహకరిస్తుందని కోలీవుడ్ పత్రికలూ అభినందించాయి. రెండు హిట్స్ కే సాయి పల్లవికి పొగరు తలకెక్కిందని విమర్శిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus