Sandeep Vanga: అంత గొప్ప వ్యక్తి ఏమన్నా తీసుకోవాలి.. ‘అర్జున్ రెడ్డి’ దర్శకుడి షాకింగ్ కామెంట్స్

  • November 29, 2023 / 08:52 PM IST

‘యానిమల్’ సినిమా ట్రైలర్ మాత్రమే కాదు.. తెలుగులో చేసిన ప్రమోషన్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి అని చెప్పాలి. ముఖ్యంగా మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్ బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఈ వేడుకకు మహేష్ బాబు, రాజమౌళి, దిల్ రాజు వంటి స్టార్లు అతిధులుగా రావడం, వాళ్ళ స్పీచ్ లు కూడా హైలెట్ అవ్వడం జరిగింది. మరోపక్క మల్లారెడ్డి స్పీచ్ అయితే బాలీవుడ్ ను కూడా కదిలించింది అని చెప్పాలి.

అంతలా ఆయన ఏం మాట్లాడారు అని మిగిలిన వాళ్ళు కూడా యూట్యూబ్ లో ఆయన స్పీచ్ లు ఎగబడి ఆయన స్పీచ్ వీడియో చూస్తున్నారు. ఇక మల్లారెడ్డి ఆ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడుతూ.. “రాబోయే రోజుల్లో టాలీవుడ్…. బాలీవుడ్ ను, హాలీవుడ్ ను కూడా ఏలుతుంది. అలాగే మీ బాలీవుడ్ సెలబ్రిటీలు.. ఇంకో సంవత్సరంలో హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలి. ముంబై పాతదైపోయింది. బెంగళూరులో విపరీతమైన ట్రాఫిక్ జామ్ తో నిండి ఉంటుంది.

ఇండియాలో హైదరాబాద్ ని కొట్టే సిటీ లేదు. అంటూ చెప్పిన ఆయన మరోపక్క మహేష్ బాబు పై కూడా ప్రశంసలు కురిపించారు. అయితే ‘బాలీవుడ్ సెలబ్రిటీలు హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలి’.. అంటూ ఆయన పలికిన పాయింట్ పై బాలీవుడ్ జనాలు హర్ట్ అయ్యారు. అందుకే మల్లారెడ్డిని తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా ఆయన పై జరుగుతున్న ట్రోలింగ్ గురించి ‘యానిమల్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. సందీప్  (Sandeep Vanga)  ఈ విషయం పై మాట్లాడుతూ.. “ఆయన చాలా సరదాగా మాట్లాడతారు.

ఆయనకు సంబంధించిన స్పీచ్ లు నేను కూడా విన్నాను. ఆయన ఏం మాట్లాడినా …జనాలు ఎంటర్ టైన్ అవుతారు. మా ఈవెంట్లో ఆయన మాట్లాడిన మాటలను నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే ఆయనకు ఇప్పుడు దాదాపు 70 ఏళ్ళు. ఆయన సాధించిన ఘనతల వల్ల అందరూ ఆయన్ని గౌరవిస్తారు. అలాంటి వారు ఏం మాట్లాడినా.. మనం ఇబ్బంది పడినా ఏం అనలేం. బాలీవుడ్ జనాలకి ఆయన గురించి తెలీదు కాబట్టి.. కొంచెం హైపర్ అవుతున్నారు అనుకోవచ్చు” అంటూ చెప్పుకొచ్చాడు.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus