తమిళ్ సినీ ఇండస్ట్రీలో తన కామెడీ టైమింగ్ తో టాప్ కమెడియన్ గా దూసుకుపోతున్న సంతానం గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు . టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బ్రహ్మానందం ఎంతటి పేరు తెచ్చుకున్నారో..సంతానం కూడా కోలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హాస్యనటుడిగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు . గత కొన్ని సంవత్సరాల క్రితం హీరోగా మారి తన లక్ పరీక్షించుకున్నారు. హీరోగా తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ బిజీగా మారాడు .
తెలుగులో డబ్బింగ్ అయినా రాజారాణి , ఓకే ఓకే వంటి సినిమాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సొంతం చేసుకున్నాడు. ఇకపోతే సభాపతి సినిమాతో సంతానం తెలుగులోకి ఏంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాతో పుగల్ హీరోయిన్ గా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన విషయం తెలిసిందే.. ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను పెద్దగా అలరించలేదు. కానీ ఆయనకు మాత్రం మంచి గుర్తింపు వచ్చింది.
సంతానం (Santhanam) గతంలో ఒక సినిమాకు రూ1.75 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకునేవారంట..హీరో అయిన తరువాత ఇప్పుడు ఆయన రూ.3 కోట్లు తీసుకుంటున్నారని నిర్మాత జ్ఞానవేల్ రాజా చెప్పారు. ప్రస్తుతం స్టూడియో గ్రీన్ పతాకంపై సంతానం హీరోగా 80స్ బిల్డప్ అనే సినిమా నిర్మిస్తున్నారు. కల్యాణ్ దర్శకత్వం వహిస్తున్న ఇందులో నటి రాధిక ప్రీతి హీరోయిన్గా నటిస్తున్నారు.
ఆడుగళం నరేన్, దర్శకుడు కేఎస్ రవికుమార్, మొటై రాజేంద్రన్, ఆనంద్రాజ్, దర్శకుడు సుందర్రాజన్, తంగదురై, స్వామినాథన్, కుంకీ అశ్విన్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జాకప్ రత్నరాజ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని శనివారం చైన్నెలోని సత్యం థియేటర్లో నిర్వహించారు.
జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!