ఇక్కడ బ్లాక్ బస్టరయినా.. అక్కడ మాత్రం క్యాష్ చేసుకోలేకపోయింది..!

  • February 21, 2020 / 01:57 PM IST

మహేష్ బాబు, రష్మిక జంటగా నటించిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మహేష్ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్స్ ను రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఇప్పటికీ ఈ చిత్రం ఓ మోస్తరు కలెక్షన్లను రాబడుతూనే ఉంది. అయితే ఓవర్సీస్ లో మాత్రం ఈ చిత్రం ఎబొవ్ యావరేజ్ ఫలితంతో మాత్రమే సరిపెట్టుకుంది. సంక్రాంతి విన్నర్ అయిన ‘అల వైకుంఠపురములో’ చిత్రం పోటీగా ఉండడంతో మహేష్ సినిమా కలెక్షన్ల పై ప్రభావం చూపినట్టయ్యింది.

ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఓవర్సీస్ లో బ్రేక్ ఈవెన్ కావడానికి 2.5 మిలియన్ డాలర్లను వసూల్ చేయాల్సి ఉండగా.. అంత వరకూ రాబట్టలేకపోయింది. అక్కడ ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం 2.28 మిలియన్ డాలర్లను మాత్రమే వసూల్ చేసింది. కాబట్టి ఎబౌవ్ యావరేజ్ గానే పరిగణించాలి. ఈమధ్య కాలంలో మహేష్ సినిమాలు ఓవర్సీస్ లో సరిగ్గా ఆడటంలేదు. ఒక్క ‘శ్రీమంతుడు’ ‘భరత్ అనే నేను’ చిత్రాల్ని పక్కన పెట్టేస్తే.. మహేష్ నటించిన అన్ని చిత్రాలు నష్టాల్నే మిగిల్చాయి. ఇక ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం ఓవర్సీస్ లో మహేష్ కు థర్డ్ హైయెస్ట్ అని చెప్పాలి. అయితే తెలుగులో మాత్రం ఈ చిత్రం పెద్ద బ్లాక్ బస్టరే..!

Most Recommended Video

‘భీష్మ’ సినిమా రివ్యూ & రేటింగ్!
‘ప్రెజర్ కుక్కర్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus