తంబీలను పలకరించనున్న అఖిల్ హీరోయిన్

  • September 6, 2016 / 11:21 AM IST

అక్కినేని వారసుడికి జోడీగా ‘అఖిల్’ సినిమాతో తెరపైకొచ్చింది దిలీప్ కుమార్ సైరా భాను మనుమరాలు సాయేషా. మేడ్ ఇన్ ముంబై మరియు ఫామిలీ బాక్గ్రౌండ్ దృష్ట్యా తొలి సినిమా ప్రభావం ఈమెపై పెద్ద ప్రభావాన్ని చూపించలేకపోయాయి. పైగా అజయ్ దేవగణ్ లాంటి స్టార్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అఖిల్ తర్వాత మరో తెలుగు సినిమాకి సంతకం చేయని ఈ అమ్మడు తాజాగా ఓ తమిళ సినిమాలో ఆడిపాడనుంది.

ఏఎల్ విజయ్ తెరకెక్కించనున్న ఓ సినిమాలో సాయేషా హీరోయిన్ గా నటించనుంది. జయం రవి హీరోగా నటిస్తోన్న ఈ సినిమా నిన్ననే లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ట్విట్టర్ లో ప్రకటించగా తమిళ్ డెబ్యూ అంటూ సాయేషా రీట్వీట్ చేసింది. హ్యారిస్ జైరాజ్ ఈ సినిమాకి స్వరాలందిస్తున్నారు. సాయేషాకిది నాలుగో సినిమా కాగా అఖిల్ బాబు మాత్రం రెండో సినిమాకి సుముహూర్తం ఖరారు చేయడానికి తచ్చాడుతున్నాడు. ‘ఇష్క్’, ‘మనం’, ’24’ చిత్రాల దర్శకుడు విక్రమ్-అఖిల్ కాంబోలో రానున్న సినిమా నవంబర్ లో పట్టాలెక్కనుందిట..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus