పవన్ సరసన సాయెషా సైగల్

  • December 14, 2016 / 07:57 AM IST

బాలీవుడ్ ప్రముఖ హీరో దిలీప్ కుమార్ కుటుంబానికి చెందిన నటి సాయెషా సైగల్. ఈ ముంబై ముద్దుగుమ్మ అఖిల్ చిత్రం ద్వారా టాలీవుడ్ లోకి ప్రవేశించింది. ఈ చిత్రం విజయం సాధించక పోవడంతో బాలీవుడ్ లో అజయ్ దేవగన్ ఫిల్మ్ శివాయ్ లో నటించింది. ఆ మూవీ కూడా ఆశించినంతగా ఆడలేదు. ఇప్పుడు కోలీవుడ్ లో ఓ మూవీ చేస్తున్న భామకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఛాన్స్ ఇచ్చారు. సెంటిమెంట్లను పక్కన పెట్టి ధైర్యంగా తన చిత్రంలో కథానాయికగా తీసుకున్నారు. గతంలోనూ శృతిహాసన్ కి ఐరెన్ లెగ్ అని ముద్రపడితే గబ్బర్ సింగ్ లో హీరోయిన్ గా అవకాశం ఇచ్చి ఆ పేరును చెరిపి లక్కీ హీరోయిన్ గా మార్చారు.

ఇప్పుడు కూడా అటువంటి సాహసం చేస్తున్నారు. తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో ఏ.ఎమ్.రత్నం నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది.   తమిళం లో అజిత్ నటించిన వేదలమ్ కు  రీమేక్ అయిన ఇందులో పవన్ చెల్లెలుగా నటి రక్షిత కనిపించనుంది. ప్రస్తుతం కాటమరాయుడు చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్న పవన్, తరవాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మూవీ చేయనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆర్ టి నేసన్, త్రివిక్రమ్ రెండు సినిమాలను ఒకే కాలంలో పూర్తి చేసే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలిసింది.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus