సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు మృతి..!
- February 11, 2020 / 06:28 PM ISTByFilmy Focus
టాలీవుడ్ సీనియర్ జర్నలిస్ట్ పసుపులేటి రామారావు ఈరోజు మరణించారు. ఈయన వయసు 70 ఏళ్ళు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఈరోజు తుదిశ్వాస విడిచారు. టాలీవుడ్ పరిశ్రమ మొదట చెన్నైలో ఉన్నప్పటి నుండీ ఈయన జర్నలిస్ట్ గా పనిచేసారు. ఎంతో మంది హీరో, హీరోయిన్లకు ఈయన పి.ఆర్.ఓ గా పనిచేస్తూ వచ్చారు. ఈయన మరణంతో టాలీవుడ్ లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. టాలీవుడ్ లోని సెలబ్రిటీలు అందరూ ఆయన మరణం పట్ల స్పందించారు.

అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి వంటి వారు ఆయన ఇంటికి వెళ్ళి.. పసుపులేటి రామారావు గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. ‘పసుపులేటి రామారావు గారు మాకు ఎంతో ఆప్తులని. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని. ఆయన టాలీవుడ్ కు చేసిన సేవలు ఎప్పటికీ మరిచిపోలేనివని’ మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. అంతేకాదు పవన్ కళ్యాణ్, నాని, సాయి ధరమ్ తేజ్, కళ్యాణ్ రామ్, దిల్ రాజు, గోపీచంద్ మలినేని వంటి వారు తమ సంతాపాన్ని తెలియజేసారు.
Most Recommended Video
జాను సినిమా రివ్యూ & రేటింగ్!
సవారి సినిమా రివ్యూ & రేటింగ్!














