భారీగా…బాక్స్ ఆఫీస్ వార్!!!

  • November 5, 2016 / 06:38 AM IST

టాలీవుడ్ లో ఇప్పుడు అంటే చాలా మంది హీరోలు వచ్చేశారు కానీ…ఒకప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలు ఎవరు అంటే…ఆ నలుగురె అని అందరూ చెప్పేవారు. వారే మన నందమూరి నట సింహం బాలయ్య…విక్టరీ వెంకటేష్….మన్మధుడు నాగ్….ఇక చిరంజీవి….అయితే ఆ నాలుగు చాలా సార్లు బాక్స్ ఆఫీస్ వద్ద పోటీ పడిన సంధర్భాలు ఉన్నాయి….వారి అభిమానులు ఒకరిపై ఒకరు పోటా పోటీగా సినిమాలను ఆదరించిన సంధర్బాలు చాలానే ఉన్నాయి. అయితే అదంతా పక్కన పెడితే….బాలయ్య..చిరు…వెంకీ ఈ ముగ్గురు పెద్ద హీరోలు…దాదాపుగా 16ఏళ్ల ముందు బాక్స్ ఆఫీస్ వద్ధ సంక్రాంతి బరిలో నిలిచారు.

అయితే అప్పుడు చిరుని..వెంకీని పక్కను నెట్టి నరసింహనాయుడుగా బాలయ్య బాక్స్ ఆఫీస్ వద్ద గర్జించి కలక్షన్ల ప్రభంజనం సృష్టించాడు. అయితే అదే వార్…..అదే ఊపు ఇప్పుడు 2017సంక్రాంతికి మళ్లీ రానుంది…2017 సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం ఖైదీ నెంబర్ 150.. బాలకృష్ణ వందో చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణిలు పొంగల్ రేస్ లో ఇప్పటికే ఉండగా.. ఇప్పుడు వెంకటేష్ గురు కూడా సంక్రాంతికే వస్తున్నట్లు టాలీవుడ్ లో బలంగా వినిపిస్తున్న వార్త…ఇక ఈ వార్త బలంగా వినిపిస్తూ ఉండడంతో పొంగల్ రేస్ లో మంచి ఊపు వచ్చింది అని టాలీవుడ్  విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే….వీటిలో బాలయ్య మూవీ శాతకర్ణి ఒక్కటే స్ట్రెయిట్ మూవీ కాగా.. కోలీవుడ్ కత్తిని ఖైదీ నెంబర్ 150 గాను.. ఇరుదు సూత్రు చిత్రాన్ని గురు పేరుతోను రీమేక్ చేస్తున్నారు. మరి ఈ సంక్రాంతి విజేత ఎవరో తెలియాలంటే సంక్రాంతి వరకూ ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus