షారుక్ ఖాన్ జీరోలో మెరవనున్న అతిలోకసుందరి

  • November 30, 2018 / 12:39 PM IST

అతిలోక సుందరి శ్రీదేవి శారీరకంగా ఈ ప్రపంచానికి మృత్యువు రూపంలో దూరమై ఉండొచ్చు. కానీ.. ఆమె సినిమాల ద్వారా మాత్రం ఎప్పటికీ ప్రేక్షకుల మనసుల్లో బ్రతికే ఉంటుంది. ఇప్పటికీ టీవీలో ఆమె నటించిన సినిమా రోజూ ఏదో ఒక చానల్ లో ప్రసారమవుతూనే ఉంటుంది. అలాంటి అద్భుతమైన నటిని వెండితెర మిస్ అవుతూనే ఉంది. ఆమె బ్రతికి ఉంటే తప్పకుండా బిజీయస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయేది. కానీ.. ఆమె అర్ధాంతర మరణం కారణంగా ఆమెను ప్రత్యేక పాత్రలో ఊహించుకొని ప్లాన్ చేసిన చాలా సినిమాలు ఆగిపోయాయి.

అయితే.. లక్కీగా షారుక్ ఖాన్ మాత్రం తన ప్లానింగ్ ప్రకారం తన తాజా చిత్రం “జీరో”లో కొన్ని నెలల క్రిందటే శ్రీదేవి క్యామియోను షూట్ చేయించాడట. దాంతో డిసెంబర్ 21న విడుదలవ్వబోయే “జీరో” చిత్రం శ్రీదేవి ఆఖరి సినిమాగా నిలిచిపోనుంది. శ్రీదేవి ఈ చిత్రంలో ఒక పాటలో నర్తించడమే కాక షారుక్ కాంబినేషన్ లో ఒక సన్నివేశంలోనూ మెరవనుందట. ఆ సన్నివేశాలు సినిమాకి ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయని చెబుతున్నాయి చిత్రవర్గాలు. ఏదేమైనా మన అతిలోక సుందరి శ్రీదేవిని ఆఖరిసారిగా “జీరో” లాంటి భారీ బడ్జెట్ సినిమాలో అది కూడా షారుక్ ఖాన్ సినిమాలో చూసే అవకాశం లభించడం విశేషమే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus