అర్జున్ రెడ్డి రీమేక్ పై షాహిద్ కపూర్ క్లారిటీ!

  • February 5, 2018 / 12:44 PM IST

“అర్జున్ రెడ్డి” చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి హిందీలో రీమేక్ చేయనున్నాడని, ఆ చిత్రంలో కథానాయకుడిగా ఇటీవల “పద్మావత్” చిత్రంతో సూపర్ హిట్ కొట్టిన షాహిద్ కపూర్ నటించనున్నాడని వార్తలొచ్చాయి. అయితే.. ఈ విషయమై దర్శకుడు సందీప్ రెడ్డి స్వయంగా తన సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తాను ఈ చిత్రం చేయడం లేదని చెప్పినప్పటికీ.. ఈ రీమేక్ లో హీరోగా షాహిద్ కపూర్ నటిస్తున్నాడని నేషన్ మీడియా మొదలుకొని యావత్ సోషల్ మీడియా భారీ స్థాయిలో పబ్లిసిటీ చేయడంతో అందరూ ఈ వార్త నిజమే అనుకొన్నారు.

అయితే.. “అర్జున్ రెడ్డి” రీమేక్ విషయమై షాహిద్ కపూర్ ను ముంబై మీడియా ప్రశ్నించగా ఆయన చాలా సింపుల్ గా “నన్నసలు ఆ సినిమా కోసం ఎవరూ అప్రోచ్ అవ్వలేదు. పైగా ఆ రీమేక్ లో నటించే ఉద్దేశ్యం కూడా తనకు లేదు” అంటూ షాహిద్ కపూర్ చెప్పేయడం ప్రస్తుతం చర్చనీయాంశం అయ్యింది.

అయితే.. సందీప్ రెడ్డి ఇటీవల మహేష్ బాబుకు ఒక కథ చెప్పాడని, త్వరలోనే ఆ సినిమా సెట్స్ కు వెళ్ళే అవకాశం కూడా ఉందని వార్తలు వస్తుండడంతో.. “అర్జున్ రెడ్డి” హిందీ రీమేక్ ఇప్పట్లో లేనట్లేనని తెలుస్తోంది. అయితే.. ఈ కన్ఫ్యూజన్ కి క్లారిటీ దొరకాలంటే మాత్రం సందీప్ రెడ్డి స్పందించాల్సిందే. ఆయన స్పందించి తన నెక్స్ట్ సినిమా ఏమిటనేది సందీప్ రెడ్డి క్లారిటీ ఇచ్చేవరకూ ఇలాంటి గాసిప్పులు గోల చేయడం షరా మామూలే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus