మన ప్రభాస్ ను ‘అర్జున్ రెడ్డి’ ఆకాశానికెత్తేశాడు..!

  • April 26, 2019 / 05:23 PM IST

తెలుగులో గేమ్ చేంజర్ మూవీగా వచ్చిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘అర్జున్ రెడ్డి’. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్ లో ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ చిత్ర టీజర్ ను ఇటీవల విడుదల చేయగా.. దానికి అద్భుతమైన స్పందన లభించింది. ఈ చిత్ర టీజర్ కు తెలుగు ప్రేక్షకులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఈ టీజర్ పై ప్రభాస్ కూడా ప్రశంసల జల్లు కురిపించాడు. ‘విజయ్ దేవరకొండ పోషించిన రౌడీ డాక్టర్ పాత్రలో షాహిద్ కపూర్ పరకాయ ప్రవేశం చేసాడని, తెలుగు వెర్షన్ టీజర్ ను మించి ఆకట్టుకుందని’ ప్రభాస్ ప్రశంసలు కురిపించాడు. షాహిద్ కి ఫోన్ చేసి 7 నిమిషాల పాటు ప్రభాస్ మాట్లాడాడట.

ఇక తాజాగా ప్రభాస్ పై షాహిద్ ఓ అవార్డుల ఫంక్షన్లో స్పందించాడు. షాహిద్ మాట్లాడుతూ.. “ప్రభాస్ తో నేను మాట్లాడాను. అతడి మనసు వెన్న లాంటిది. ఎంతో మృధు స్వభావి. ప్రభాస్ మనకు మహేంద్ర బాహుబలి. తన నుండీ వచ్చిన ప్రశంసలు ఎంతో కూల్ గా.. ప్రోత్సాహకంగా ఉన్నాయి. ‘అర్జున్ రెడ్డి’ చిత్రం గురించి హిందీ ప్రేక్షకులకు తెలిసింది తక్కువే. తెలుగులో ఐకానిక్ చిత్రమిది. అక్కడ ప్రేక్షకులు గొప్పగా ప్రేమించి ఆదరించారు” అంటూ తెలిపాడు. ఏమైనా మన డార్లింగ్ ప్రభాస్ రోజు రోజుకి బాలీవుడ్లో కూడా ఎదిగిపోతున్నాడు అనడంలో సందేహం లేదు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus