ఈ నెల 31 కి ‘శైలజా రెడ్డి అల్లుడు’ థియేటర్లోకి వస్తాడా ?

  • August 20, 2018 / 12:09 PM IST

మహానుభావుడు వంటి హిట్ తర్వాత మారుతీ దర్శకత్వం వహిస్తున్న మూవీ “శైలజా రెడ్డి అల్లుడు”. శైలజా రెడ్డిగా రమ్యకృష్ణ, అల్లుడిగా నాగ చైతన్య నటిస్తున్న ఈ మూవీ మొదటి నుంచి ఆసక్తిని కలిగిస్తోంది. టైటిల్, కాంబినేషన్ తోనే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని అర్ధమయింది. ఇక టీజర్, సాంగ్స్ అయితే అక్కినేని అభిమానులకు తెగ నచ్చేసింది. శైలజా రెడ్డి కూతురిగా అను ఇమ్మాన్యుయేల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని ఈ నెల 31వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ఇది వరకు ప్రకటించారు. అయితే ఆ సమయానికి అల్లుడు థియేటర్లోకి రావడం కష్టమేనని ఫిలిం నగర్ వాసులు చెప్పారు.

ఈ సినిమాకి రీ రికార్డింగ్ పనులు కొన్ని రోజులుగా కేరళలో జరుగుతున్నాయి. గోపీసుందర్ దగ్గరే ఉండి రీ రికార్డింగ్ చేయించుకోవడం కోసం దర్శకుడు మారుతి అక్కడికి వెళ్లారు. కేరళలో వానలు .. వరదలు మొదలు కావడంతో రీ రికార్డింగ్ పనులకు అంతరాయం కలిగింది. అక్కడి రీ రికార్డింగ్ పనులు ఆగిపోవడం .. అక్కడ మారుతి చిక్కుబడటం వలన, ఆయన ఇక్కడ చేయవలసిన పనులు కూడా ఆగిపోయాయి. అనుకోకుండా వచ్చిన ఈ అవాంతరం వలన ఈ సినిమా ముందుగా ప్రకటించిన సమయానికి రాలేకపోవచ్చని భావిస్తున్నారు. ఆ సమయానికి రాకపోతే సెప్టెంబర్ 4వ తేదీన విడుదల చేసే అవకాశం ఉన్నట్టు టాక్. ఈ విషయంలో త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus