మహేష్ 25 చిత్రంలో ఛాన్స్ అందుకున్న అర్జున్ రెడ్డి భామ.!

  • April 10, 2018 / 07:26 AM IST

కొరటాల శివ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయ నేపథ్యంలో సాగే ఈ మూవీ షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది. బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఈనెల 20 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ చిత్రంతో పాటు మహేష్ బాబు నెక్స్ట్ చేసే సినిమా పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. మహేష్ కెరీర్ లో ప్రతిష్టాత్మక చిత్రానికి వంశీ పైడి పల్లి అన్నీ పక్కాగా సెట్ చేస్తున్నారు. ఇందులో హీరోయిన్ గా డీజే బ్యూటీ పూజా హెగ్డే ఖరారు అయింది. అలాగే తాజాగా ‘అర్జున్‌రెడ్డి’ భామ షాలిని పాండే ని సెలక్ట్ చేసినట్లు తెలిసింది.

హీరోయిన్ గా కాకుండా సినిమాలోని ఓ కీలక పాత్రలో ఆమె కనిపించే అవకాశాలు ఉన్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, వైజయంతి మూవీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం నెలరోజుల క్రితం డైరక్టర్, డీఓపీ పీఎస్ వినోద్, ప్రొడక్షన్ డిజైనర్ సునీల్ బాబు తో కలిసి న్యూ యార్క్ కి వెళ్లి అక్కడ అందమైన లొకేషన్స్ ని సెలక్ట్ చేశారు. అలాగే రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మంచి పాటలను కంపోజ్ చేయడంలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా మే నుంచి రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లాలని నిర్మాతలు భావిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus